AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. జనవరి నుంచి ఉచితంగా ఆ ఐదు కిలోల బియ్యం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని రేషన్‌కార్డులకు కేంద్ర ప్రకటించిన ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ డిసెంబర్‌ నెలతో ముగిసింది. తర్వాత ఆ..

Telangana: తెలంగాణ రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. జనవరి నుంచి ఉచితంగా ఆ ఐదు కిలోల బియ్యం పంపిణీ
Telangana Ration
Subhash Goud
|

Updated on: Jan 11, 2023 | 2:01 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని రేషన్‌కార్డులకు కేంద్ర ప్రకటించిన ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ డిసెంబర్‌ నెలతో ముగిసింది. తర్వాత ఆ ఉచిత రేషన్‌ బియ్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు మోడీ సర్కార్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టేందుకు ముందుగా నిర్ణయించుకోగా, తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. జనవరి నెల నుంచి కేంద్రం ఇచ్చే ఆ ఐదు కిలోల బియ్యాన్ని తిరిగి పంపిణీ చేస్తున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో కొన్నేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి ముగింపు పలికేందుకు సిద్ధం కాగా, జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే.. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికీ 5 కిలోల చొప్పునే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో జనవరి నెల నుంచి సంవత్సరం పాటు రేషన్‌‌‌‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. అయితే తన నిర్ణయాన్ని మార్చుకున్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియాన్ని బుధవారం నుండి రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, గతంలో కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు బియ్యం ఇచ్చేది. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున ఇచ్చేది. ఇకపై అన్ని కార్డులపైనా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పునే బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులు పేద ప్రజలకు ఆందోళన కలిగించింది. దీంతో కోత విధిస్తున్నట్లు ప్రకటించిన ఆ 5 కిలోల బియ్యాన్ని తిరిగి జనవరి 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

కాగా, గతంలో ప్రభుత్వం ప్రకటించిన 10 కిలోల ఉచిత బియ్యం కార్యక్రమం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు మోడీ సర్కార్‌ ప్రకటించింది. డిసెంబరు 23న ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్‌‌‌‌ సమావేశమై దేశవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని ఈ జనవరి1 నుంచి 2023 డిసెంబర్‌‌‌‌ వరకు ఏడాదిపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..