AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సీఐడీ అధికారుల ముసుగులో ఘరానా మోసం.. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్..

ఏపీ సీఐడి అధికారులమంటూ.. ఓ ఐటీ కంపెనీని బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. కోట్లల్లో డీల్‌ సెట్ చేసుకుని.. లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ నకిలీ గ్యాంగ్‌లో ఏపీకి చెందిన ఎస్ఐ కూడా భాగస్వామి అయ్యాడు. డబ్బులకు కక్కుర్తి పడి.. కటకటాల పాలయ్యాడు. AJA యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది.

Hyderabad: సీఐడీ అధికారుల ముసుగులో ఘరానా మోసం.. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్..
Hyderabad Kidnap Case
Srikar T
|

Updated on: Jan 30, 2024 | 8:04 PM

Share

హైదరాబాద్, జనవరి 30: ఏపీ సీఐడి అధికారులమంటూ.. ఓ ఐటీ కంపెనీని బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. కోట్లల్లో డీల్‌ సెట్ చేసుకుని.. లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ నకిలీ గ్యాంగ్‌లో ఏపీకి చెందిన ఎస్ఐ కూడా భాగస్వామి అయ్యాడు. డబ్బులకు కక్కుర్తి పడి.. కటకటాల పాలయ్యాడు. AJA యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. గత కొన్నేళ్ళుగా ఉద్యోగాలను ఇప్పిస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగి మరో 9మంది కలిసి.. ఏపి సిఐడి అధికారులమంటూ ఈ నెల 27న కంపెనీలోకి వెళ్లారు. ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి తనిఖీలు నిర్వహించి డివిఆర్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు.

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. చివరికి 2.3 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్‌ దర్శన్‌ సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి ఓ హోటల్‌కి తీసుకెళ్లి.. 10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు నిందితులు. డబ్బులు తీసుకుని దర్శన్‌ను వదిలేయడంతో.. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ తతంగానికి AJA యాడ్స్‌లో గతంలో పనిచేసిన రంజితే మూల కారణమన్నారు మాదాపూర్ డిసిపి వినీత్. కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పనిచేస్తున్న సుజన్‌తో కలిసి కుట్రపన్నారని చెప్పారు. రంజిత్, సుజనే ఈ స్కెచ్‌కు కర్త, కర్మ, క్రియ అని తేల్చారు. మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 4 కార్లు, 16 సెల్‌ఫోన్లు సీజ్ చేశామన్నారు మాదాపూర్ డిసిపి వినీత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ధనవంతులు కూడా హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
ఆ స్టార్ హీరోకు వీరాభిమానిని.. కానీ ఆయన సినిమాలో చేయనని చెప్పా
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
చరిత్రలో మొదటిసారి..పగలు రాత్రి కాబోతోంది..
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్