AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: మరో మారు ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉత్తరం వ్రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.. ఈసారి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ఘాటు లేఖ సంధించారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చి హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Harish Rao: మరో మారు ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉత్తరం వ్రాసిన మాజీ మంత్రి హరీష్ రావు.. ఈసారి..!
Revanth Reddy Harish Rao
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 03, 2024 | 11:16 AM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ఘాటు లేఖ సంధించారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చి హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్వయంగా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రేవంత్ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నారన్నారు. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నా.. ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదన్నారు హరీష్. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయని హరీష్ రావు గుర్తు చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నదన్నారు హరీష్.

రైతులను బ్యాంకులు డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతోంది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలతో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఏ ఓక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు. లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణమాఫీ పొందగలిగారన్నారు.

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదన్నారు హరీష్ రావు. ఈ అనిశ్చితి.. గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతోందన్న హరీష్.. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు ఇస్తున్నారన్నారు. దీంతో వారు రైతుల మీద పడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుఃన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక, ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరారు. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్న హరీష్.. తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు 70 శాతం వరకు ఉన్నాయన్నారు. అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను గోస పెట్టడం ఏమాత్రం సమ్మతం కాదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాట అంటూ గుర్తు చేశారు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించే విధంగా.. ఇచ్చిన హామీలన్నిటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.  మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై