Telangana: నేడు కాషాయం కండువా కప్పుకోనున్న మర్రి శశిధర్ రెడ్డి.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
కాంగ్రెస్ పార్టీపై మర్రిశశిధర్రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతూనే ఉన్నాయి. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేతకు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మాజీ విప్ ఈరవతి అనిల్ నోటీసు పంపారు.
మాజీ మంత్రి, సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ (నవంబర్ 25) కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీంతో గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, సీనియర్ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై మర్రిశశిధర్రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతూనే ఉన్నాయి. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేతకు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మాజీ విప్ ఈరవతి అనిల్ నోటీసు పంపారు. మరోవైపు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడామంటున్నారు మర్రి శశిధర్ రెడ్డి వర్గం.
కాంగ్రెస్ లీగల్ నోటీసులు మర్రిశశిధర్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్లో మంట పుట్టిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డిని బంగారు బాతుతో పోల్చిన మర్రి.. నిత్యం డబ్బులు పంపుతాడన్న మీనింగ్లో కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టిన మర్రి.. మాణిక్యం ఠాగూర్ మొదలుకొని కాంగ్రెస్ పెద్దలపై హాట్ కామెంట్స్ చేశారు. కాగా కాంగ్రెస్కు హ్యాండిచ్చిన మర్రి శశిధర్రెడ్డికి ఢిల్లీ పెద్దలు నోటీసు కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనను హైకమాండ్ వెంటాడుతూనే ఉంది. మాణిక్యం ఠాగూర్పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో కాంగ్రెస్ పార్టీ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లీగల్ నోటీసులు పంపించారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన శశిధర్ .. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కఠువుగా మాట్లాడారు. డైలాగ్కు రియాక్షన్ అన్నట్టుగా.. శశిధర్రెడ్డికి ఈ నోటీసులిచ్చారు. మాణిక్కం ఠాగూర్… రేవంత్ రెడ్డికి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ శశిధర్రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఠాగూర్ పుట్టక ముందు నుంచి తాను రాజకీయాలు చూస్తున్నారన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందంటూ శశిధర్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బాగు కోసమే..
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కు లేదని మర్రి శశిధర్రెడ్డి అన్నారు . రేవంత్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆయన తీరు వల్లే చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్న.. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో ఉండడన్నారు. కాంగ్రెస్ను వీడుతున్నట్టు ప్రకటించిన శశిధర్రెడ్డి.. ఇవాళ బీజేపీలో చేరుతున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. శశిధర్రెడ్డి చేరికపై బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు. అయితే.. ఈ లీగల్ నోటీసుకు శశిధర్రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..