AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇంకా జరిమానా ఎంతంటే..?

తెలంగాణకు చెందిన ఓ నాలుగేళ్ల బాలికపై 2016లో లైంగికదాడి జరిగితే.. ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి స్థానిక కోర్టు గురువారం..

Telangana: అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇంకా జరిమానా ఎంతంటే..?
Katam Raju
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 25, 2022 | 8:55 AM

Share

తెలంగాణకు చెందిన ఓ నాలుగేళ్ల బాలికపై 2016లో లైంగికదాడి జరిగితే.. ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి స్థానిక కోర్టు గురువారం(నవంబర్ 24) పోక్సో చట్టం కింద  20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో దుసరి రాజు అలియాస్ కాటం రాజు అనే నిందితుడిని దోషిగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హరీష అతనికి రూ.20 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడు రంగారెడ్డి జిల్లాలోని మంచాల్‌ వాసి. 2016లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మంచాల్ పోలీసులకు ఆ ఏడాది ఫిబ్రవరి 5న ఫిర్యాదు అందింది. ఇందులో ‘కాటం రాజు నా 4 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడ’ని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.

డబ్బు ఎర చూపి..

ఆడుకుంటున్న బాలికకు కాటం రాజు డబ్బు ఇస్తానని చెప్పి సమీపంలోని ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4న నిందితుడు మళ్లీ డబ్బులిస్తామని చెప్పి బాలికను సమీపంలోని ఇంటికి పిలిపించేందుకు ప్రయత్నించగా, ఆ రోజు ఆమె అతని వద్దకు వెళ్లలేదు. దీంతో బాలిక జరిగిన మొత్తం విషయాన్ని తన తల్లికి తెలియజేసింది. దీంతో అతని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంచాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణలో మంచాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆధారాలు సేకరించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

విచారణ పూర్తయిన తర్వాత పోలీసు అధికారి ఎం గంగాధర్ చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారిస్తూ ఎల్‌బీ నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీష నిందితుడు దూసరి రాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ.. గురువారం తీర్పు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..