AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS: తెలంగాణలో కార్యరూపం దాల్చిన తొలి కేజీ టూ పీజీ విద్యాలయం.. ఫొటోలు చూసి ఆశ్చర్యపోతున్న నెటిజనం..

Telangana: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని..

TS: తెలంగాణలో కార్యరూపం దాల్చిన తొలి కేజీ టూ పీజీ విద్యాలయం.. ఫొటోలు చూసి ఆశ్చర్యపోతున్న నెటిజనం..
Narender Vaitla
|

Updated on: Aug 11, 2022 | 6:03 PM

Share

Telangana: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు కేజీ స్థాయి నుంచి పీజీ వరకు అన్ని ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యాలయాలను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ దిశగా తొలి అడుగు పడింది.

తెలంగాణలో కిండర్‌ గార్డెన్‌ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు ఒకే చోట విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తొలి విద్యాలయం నిర్మాణం పూర్తి అయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్లాలోని గంభీరావుపేటలో తొలి కేజీ టూ పీజీ విద్యాలయాన్ని నిర్మించారు. ఈ విద్యాలయానికి సంబంధించిన ఫొటోలను తెలంగాణ రెనూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ స‌తీశ్‌ రెడ్డి గురువారం ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్‌ స్థాయిలో ఉన్న ప్లే గ్రౌండ్‌, ఊరి మధ్యలో విశాలంగా నిర్మించిన భవనం, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..