AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతు కోసం ఊరు ఊరంతా కదిలింది.. కబ్జాకు గురైన భూమిలో మూకుమ్మడిగా దుక్కులు

ఓ రైతు కోసం ఊరు ఊరంతా కదిలింది. మీ కుటుంబానికి మేమున్నామంటూ అభయహస్తం అందించింది. కబ్జాకు గురైన భూమిలో మూకుమ్మడిగా దుక్కులు దున్నారు. విత్తనాలు నాటి అన్నదాతకు అండగా నిలిచారు.

Telangana: రైతు కోసం ఊరు ఊరంతా కదిలింది..  కబ్జాకు గురైన భూమిలో మూకుమ్మడిగా దుక్కులు
Telangana News
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2022 | 9:48 PM

Share

ఓ రైతు కోసం ఊరు ఊరంతా కదిలింది. మీ కుటుంబానికి మేమున్నామంటూ అభయహస్తం అందించింది. కబ్జాకు గురైన భూమిలో మూకుమ్మడిగా దుక్కులు దున్నారు. విత్తనాలు నాటి అన్నదాతకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) తలమడుగు మండలం(Talamadugu)కజ్జర్ల(Kajjarla)  గ్రామానికి చెందిన యాళ్ల జైపాల్ రెడ్డి తండ్రి రాజారెడ్డి..36 ఏళ్ల క్రితం అబ్దుల్ ఘని అనే వ్యక్తి తండ్రి వద్ద 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో బాండ్​ పేపర్ మీద రాయించుకున్నారు. 36 ఏళ్లుగా భూమి సాగుచేసుకుంటున్నప్పటికీ పట్టా చేయించుకోలేదు. మూడేళ్ల కింద రాజారెడ్డి చనిపోవడంతో భూమి పట్టా కోసం ఆయన కొడుకు జైపాల్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఐతే ధరణి రాకతో రాజారెడ్డి భూమికి పట్టా కాలేదు. దీనికితోడు అబ్ధుల్‌ ఘనీ పేరిట కొత్త పట్టా పాస్‌బుక్‌ రావడంతో అసలు సమస్య తెరమీదికొచ్చింది. జైపాల్ రెడ్డి సాగు చేస్తున్న భూమి తమదేనని, ఖాళీ చేసి తమకు అప్పగించాలని ఘనీ కొడుకులు..జైపాల్​రెడ్డి‌ని, ఆయన కొడుకు చరణ్​​రెడ్డిని బెదిరించారు. పొలంలోకి అడుగు పెట్టవద్దంటూ దౌర్జన్యం చేశారు. రియల్​ మాఫియాతో వచ్చి జైపాల్​రెడ్డి కుటుంబంపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి‌ గురైన జైపాల్​రెడ్డి, చరణ్​ రెడ్డి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు స్థానికులు. ఈ ఘటనతో భగ్గుమన్న కజ్జర్ల గ్రామస్తులు..జైపాల్‌రెడ్డిపై దాడికి తెగబడ్డవారిని అరెస్ట్ చేయాలని ఆందోళనకు దిగారు. జైపాల్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయన సాగు చేసుకుంటున్న భూమికి ఊరంతా మూకుమ్మడిగా వెళ్లి నాగళ్లతో దుక్కులు దున్ని సాగు చేశారు. జైపాల్ రెడ్డి కుటుంబానికి ఊరంతా అండగా ఉంటుందని..ఎవ్వడు భూమిని లాక్కుంటాడో రమ్మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కజ్జర్ల గ్రామస్తులు..అధికారులు స్పందించి జైపాల్‌రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని..లేదంటే ఐక్య పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
నన్ను టచ్ చేస్తే ఆ దేశం భూమిపై ఉండదు.. బాంబుల వర్షమే..
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!