AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అభిషేక్‌ను 9 గంటలు విచారించిన ఈడీ.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశం..

మాణిక్ చంద్‌ గుట్కా కేసులో అభిషేక్‌ను 9గంటలపాటు విచారించింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదన్న అభిషేక్‌.. రేపు మరోసారి ఈడీ విచారణకు పిలిచిందన్నారు.

Hyderabad: అభిషేక్‌ను 9 గంటలు విచారించిన ఈడీ.. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశం..
Enforcement Directorate
Shiva Prajapati
|

Updated on: Dec 23, 2022 | 5:43 AM

Share

మాణిక్ చంద్‌ గుట్కా కేసులో అభిషేక్‌ను 9గంటలపాటు విచారించింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదన్న అభిషేక్‌.. రేపు మరోసారి ఈడీ విచారణకు పిలిచిందన్నారు. గుట్కా వ్యాపారంపై దర్యాప్తును ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. దందాలో నందకుమార్ మోసం చేశాడని బంజారాహిల్స్ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఇప్పటికే ఈడీ కొంతమందికి నోటీసులిచ్చింది. విచారణకు హాజరుకావాలని గుట్కా సంస్థ డైరెక్టర్ అభిషేక్‌కు నోటీసులివ్వడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు.. బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌ సహా విచారణకు హాజరయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు అభిషేక్ ఫిర్యాదు చేశారు. తమ సంస్థ మాణిక్‌చంద్ పాన్ మసాలా పేరును 40 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్‌ చేసుకున్నామని.. రెండు కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చి ఆ తర్వాత ముఖం చాటేశాడని ఫిర్యాదులో ఆరోపించారు అభిషేక్‌. ప్రధానంగా నంద కుమార్‌, రోహిత్‌ రెడ్డితో పరిచయాలు.. వ్యాపార లావాదేవీలపై అభిషేక్‌ను ప్రశ్నించారు అధికారులు.

ఈనెల 27న హాజరు కావాలని నోటీసు..

ఇదే కేసులో ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఈనెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించారు. విచారణ కొనసాగుతుండగానే నందకుమార్‌పై మోసం కేసులో ఫిర్యాదు చేసిన అభిషేక్‌ను పిలవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. గంటలకొద్ది సాగిన విచారణలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, స్థిర, చరాస్తులు, వ్యాపార సంస్థల పై ఈడీ వేర్వేరు కోణాల్లో ఆరా తీసినట్టు సమాచారం. ఇక నెక్స్ట్‌ నోటీసులు ఎవరికి అన్నది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..