Congress: కాంగ్రెస్ మిషన్ 80 కోసం కసరత్తు.. ఆరోజు వరకు అన్ని జరిగిపోవాలని భావిస్తున్న హైకమాండ్..!

ఆషాడం వచ్చే ముందే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల ముందే చేరికలు పూర్తి కావాలని అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను వారితోనే మాట్లాడించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Congress: కాంగ్రెస్ మిషన్ 80 కోసం కసరత్తు.. ఆరోజు వరకు అన్ని జరిగిపోవాలని భావిస్తున్న హైకమాండ్..!
Telangana Congress
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 05, 2024 | 6:04 PM

తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 80 టార్గెట్ గా పెట్టుకుని వీలైనంత త్వరగా టార్గెట్ ఫినిష్ చేయాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 80కి చేరాలని డిసైడ్ అయ్యారు. మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏం అవుతుందో అని భయపడ్డ రేవంత్, హై కమాండ్ గ్రీన్ సిగ్నల్‌తో తన దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారట. రాష్ట్ర పరిస్థితులను రేవంత్ మొన్న ఢిల్లీ పెద్దలకు తెలిపినట్టు సమాచారం. ఏదేమైనా అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని, ఎవరు అడ్డు చెప్పినా తాము చూసుకుంటామని హై కమాండ్ చెప్పడంతో రేవంత్ తన బాధ్యతను కంప్లీట్ చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టారు.

లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిర‌త‌ను కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఢిల్లీ టూర్ లో రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి తెలియచేశారట. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించిన హస్తం నేతలు చేరికలకు కొద్ది రోజులు విరామం ప్రకటించారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడ్డట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ సైతం ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో ఎమ్మెల్యేలను బీజేపీలోకి వెళ్లకుండా కట్టడి చేయడం, తమతో కలుపుకుపోవడం వెంటనే జరగాలని హస్తం నేతలు భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 65 కి పెరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ సంఖ్యా బలం 71 కి చేరింది.

ఇక ఈ రెండు మూడు రోజుల్లోనే మరిన్ని చేరికలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు. ఆషాడం మొదలవక ముందే కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చ‌ర్చలు పూర్తయ్యాయ‌ట. రెండు మూడు రోజుల్లోనే వారు తమ గూటికి వస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్‌లో చేరేందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ స్వంత జిల్లా మెద‌క్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నార‌ట‌. క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలోని చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ట‌చ్‌లోకి రావడంతో ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఎమ్మెల్యేల‌తో పాటు ఎమ్మెల్సీల‌పై కూడా కాంగ్రెస్ ఫోక‌స్ పెట్టింది. మెజారిటీ ఎమ్మెల్సీలు త‌మ‌కు నెక్ట్స్ ట‌ర్మ్ రెన్యూవ‌ల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ పాల‌సీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమ‌ని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని ముఖ్యనేత‌లు హామీ ఇస్తున్నారట. దీంతో రాత్రికి రాత్రే ఆరుగురు MLCలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకో 9 మంది MLC లను పార్టీలోకి ఆకర్షించి 2/3 మెజార్టీ కంప్లీట్ చేస్తే, BRS విలీనం చేసుకునే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్సీల‌ను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకొని పెద్దల స‌భ‌ను కూడా త‌మ ఆధీనంలోకి తీసుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీల‌క బిల్లుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే మండ‌లిలో కూడా మెజారిటీ సాధించాల‌ని పార్టీ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పచెప్పినట్టు సమాచారం.

ఆషాడం వచ్చే ముందే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల ముందే చేరికలు పూర్తి కావాలని అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను వారితోనే మాట్లాడించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేర‌కు కలిసి వస్తాయో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!