AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన.. ఎందుకంటే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(CM KCR) ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ ..

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన.. ఎందుకంటే..
Cm Kcr
Sanjay Kasula
|

Updated on: Apr 28, 2022 | 7:36 AM

Share

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(CM KCR) ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumarthi Lingaiah) తండ్రి చిరుమర్తి నర్సింహ ఇటీవల మరణించడంతో.. ఈ నేపథ్యంలోనే నేడు సంతాప సభ జరగనుంది. కాగా ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి నార్కట్ పల్లికి చేరుకొని.. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మధ్యాహ్న భోజనం చేస్తారు సీఎం కేసీఆర్.

అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక నిన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అలాగే జాతీయ రాజకీయాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!