AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి రూ. 5 లక్షల బీమా సాయం

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. త్వరలోనే గీత కార్మికులకు బీమా పథకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అందిస్తున్న రైతు బీమా మాదిరిగానే గీత కార్మికులకు సైతం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి..

Telangana: మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి రూ. 5 లక్షల బీమా సాయం
KCR
Narender Vaitla
|

Updated on: May 02, 2023 | 7:37 PM

Share

తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. త్వరలోనే గీత కార్మికులకు బీమా పథకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అందిస్తున్న రైతు బీమా మాదిరిగానే గీత కార్మికులకు సైతం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని అందించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్స్ఛేజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదేశించారు.

దీనికి సంబంధించి సీఎం మంగళవారం డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అలాంటి ఊహించని సందర్భాల్లో మరణించిన కల్లు గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సీఎం తెలిపారు.

ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా మాదిరిగానే బీమాను అందించనున్నారు. కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న, గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందుతుందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..