AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: ‘కాంగ్రెస్‌ తెచ్చిన కరువు’.. బడ్జెట్ వేళ ఎండిన వరికంకులతో బీఆర్‌ఎస్‌ నిరసనబాట..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని..రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

KTR: ‘కాంగ్రెస్‌ తెచ్చిన కరువు’.. బడ్జెట్ వేళ ఎండిన వరికంకులతో బీఆర్‌ఎస్‌ నిరసనబాట..
BRS MLAs and MLCs
Shaik Madar Saheb
|

Updated on: Mar 19, 2025 | 1:57 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని..రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నయంటే.. ముందుచూపు లేని ప్రభుత్వమే కారణమన్నారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ. 25 వేల రూపాయల చొప్పున పంటల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని.. సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇటు నీరు లేక పంటలు పండక.. అటు రుణ మాఫీ జరగక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొన్నారు. గతంలో ఎండని పంటలు ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎండిపోయిన పంటల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతులకు అండగా భరోసాగా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ పర్యటిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ