Telangana: పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్.. కట్చేస్తే..
సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. నా అనేవాళ్ళే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం సొంత బామ్మర్దినే చంపేందుకు ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సొంత బామ్మర్దిని హత్య చేసేందుకు కుట్ర చేసిన బావ బండారం బయటపడింది. కొందరు మైనర్ యువకులతో రిక్కీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఆ బావ. అంకుశాపూర్ గ్రామానికి చెందిన పెంటయ్య.. తన కూతురు లావణ్యను మసీదు బండ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడితో వివాహం జరిపించాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెంటయ్య తన కూతురు లావణ్యకు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో డబ్బులు ఎందుకు ఇవ్వరంటూ లావణ్య భర్త శ్రీనివాస్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో గొడవను నిలువరించడానికి లావణ్య తమ్ముడు ఈశ్వర్ బావ శ్రీనివాస్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాదన కాస్తా తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకూ వచ్చింది. బావని అయిన తన మీదే బామ్మర్ది ఈశ్వర్ దాడి చేస్తాడా అని శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా తన మామ పెంటయ్య ఆస్తి 3 ఎకరాలను కొట్టేయడంతో పాటు బామ్మర్దిని చంపడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకున్నారు.
ఈ మేరకు లావణ్య – శ్రీనివాస్ లు బామ్మర్దిని చంపించి, ఆస్తిని ఎలాగైనా కొట్టేయడానికి మైనర్లకు సుపారీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆస్తి కొట్టేయాలనే ఉద్దేశ్యంతో సొంత తమ్ముడిని కూడా చంపడానికి లావణ్య, బామ్మర్ది ప్రాణం తీయడానికి శ్రీనివాస్ ఘోరానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మైనర్లకు సుపారీ ఇచ్చి రిక్కీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అనుమానాస్పదంగా కనిపించిన మైనర్లను విచారించగా.. శ్రీనివాస్ అతని భార్య లావణ్యల బండారం బయటపడింది. ఇంత దారుణానికి పాల్పడాలని చూసిన ఆ ఇద్దరిపై ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ అతని భార్య లావణ్య, చంపడానికి ఒప్పుకున్న ఆ ముగ్గురు మైనర్లు పోలీసుల అదుపులో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..