AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో కొడుతూ..

ప్రస్తుతం వీరయ్యకు చికిత్స కొనసాగుతోంది. అసలు ప్లాట్ విషయంలో ఇంతలా కొట్టుకునేవరకూ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కర్రలు, బండలతో దాడి చేస్తూ కొందరు యువకులపై పిడిగుద్దులతో కొడుతూ తీవ్రంగా గాయపరిచారు. గొడవ ఆపడానికి అడ్డుగా వచ్చిన మహిళలపై కూడా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో కొడుతూ..
Fight
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 17, 2025 | 9:18 PM

ఓ ప్లాట్ విషయం ఇరువర్గాల మధ్య దాడికి దారి తీసింది. రోడ్డుపైనే ఘోరంగా కొట్టుకునే వరకూ వచ్చింది పరిస్థితి. విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో ఆ గొడవలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి గురైనవారిలో మహిళలు కూడా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆడవాళ్లని కూడా చూడకుండా చేయి చేసుకున్న దారుణ ఘటన హైదరాబాద్ నగరం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది.

మేడ్చల్ సురారం పీఎస్ పరిధిలోని కృషి కాలనీలో ఓ 132 గజాల ఓ ప్లాట్ విషయంలో ఇరువర్గాల మధ్య దాడి జరిగింది. చర్చించుకుంటే తీరిపోయే సమస్య తీవ్రరూపం దాల్చే వరకు తీసుకొచ్చారు. ఈ దాడిలో స్వరాజ్యం(29), చైతన్య, లక్ష్మీ, అనూషతో పాటు మరి కొంతమందిపై కర్రలు, బండలు, డ్రమ్ములతో ఓ వర్గం దాడి చేస్తూ విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పల్లపు వీర్యయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని స్థానిక మల్లారెడ్డి హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వీరయ్యకు చికిత్స కొనసాగుతోంది. అసలు ప్లాట్ విషయంలో ఇంతలా కొట్టుకునేవరకూ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కర్రలు, బండలతో దాడి చేస్తూ కొందరు యువకులపై పిడిగుద్దులతో కొడుతూ తీవ్రంగా గాయపరిచారు. గొడవ ఆపడానికి అడ్డుగా వచ్చిన మహిళలపై కూడా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.

కాగా, దాడికి గురైన వారిలో ఒకరైన స్వరాజ్యం అనే మహిళ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. దాడికి పాల్పడిందే కాకుండా దాడి చేసిన వర్గం కూడా ఈ రోజు సురారం పీఎస్‌లో ఫిర్యాదు చేయడం ఇక్కడ మరో ట్విస్ట్. ఈ మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన సూరారం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..