AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అర్థరాత్రి చప్పుళ్లు.. భయంతో పోలీసులకు స్థానికుల ఫోన్.. వచ్చి చూడగా షాకింగ్ సీన్

టెక్నాలజీ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. త్వరలో 5జీ రాబోతుంది. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ కూడా కనిపెట్టాం. కానీ.. మూఢనమ్మకాలకు మాత్రం ఎండ్ కార్డ్ వేయలేకపోతున్నాం.

Telangana: అర్థరాత్రి చప్పుళ్లు.. భయంతో పోలీసులకు స్థానికుల ఫోన్.. వచ్చి చూడగా షాకింగ్ సీన్
Representative image
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2022 | 6:54 PM

Share

Mahabubabad: టెక్నాలజీ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. త్వరలో 5జీ రాబోతుంది. ఆకాశంలో అద్భుతాలు చేస్తున్నాం. మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్(Corona Vaccine) కూడా కనిపెట్టాం. కానీ.. మూఢనమ్మకాలకు మాత్రం ఎండ్ కార్డ్ వేయలేకపోతున్నాం.  క్షుద్రపూజలు(Black Magic) చేస్తున్నారని వారిని హత్య చేసిన ఉదంతాలు.. క్షుద్రపూజల పేరిట కొందరు మోసం చేసిన ఘటనలు కూడా గతంలో ఎన్నో వెలుగుచూశాయి. ముఖ్యంగా పల్లెల్లో, తండాల్లో ఈ భయాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ఆది, బుధ వారాలు వచ్చాయంటే చాలు ఏదో ఒకచోట క్షుద్ర పూజలు, చేతబడి చేస్తున్నారు. తాజాగా  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. కాకతీయకాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా క్షుద్రపూజలు నిర్వహించారు.  ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి క్షుద్రపూజలు నిర్వహించాడు మాంత్రికులు. కోళ్లు బలిచ్చి, నిమ్మకాయలు, జీడిగింజలు, పసుపు- కుంకుమతో తాంత్రిక పూజలు చేశారు. రాత్రి పూట ఇంటి నుంచి చప్పుళ్లు వినిపించడంతో స్థానికుల భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మహబూబాబాద్ సీ.ఐ సతీష్ స్పాట్ కు చేరుకున్నారు. క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ఇద్దరు మాంత్రికులతో పాటు, మరోవ్యక్తి అరెస్ట్ చేశారు. ఓ మహిళ కుమారుడికి వాహన గండం ఉందని నమ్మించి.. ఆ గండం నుండి రక్షిస్తామని క్షుద్రపూజలు నిర్వహించాడు పూజారులు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఖిలాడీ పూజారాలను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే