AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 40 మంది పోలీసులు చుట్టుముట్టి లాక్కెళ్లారు ; బండి సంజయ్ కుటుంబ సభ్యుల ఆగ్రహం

టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా సంజయ్‌ని అరెస్టు చేశారని ఆయన భార్య అపర్ణ తెలిపారు. ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడిన ఆమె.. అసలేం జరిగిందనే వివరాలు వెల్లడించారు. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని..

Telangana: 40 మంది పోలీసులు చుట్టుముట్టి లాక్కెళ్లారు ; బండి సంజయ్ కుటుంబ సభ్యుల ఆగ్రహం
Bandi Bhageerath
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 05, 2023 | 1:20 PM

Share

టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా సంజయ్‌ని అరెస్టు చేశారని ఆయన భార్య అపర్ణ తెలిపారు. ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడిన ఆమె.. అసలేం జరిగిందనే వివరాలు వెల్లడించారు. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని.. టాబ్లెట్‌ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు అపర్ణ. సంజయ్‌ హార్ట్ పేషెంట్ అని, గతంలో ఒకసారి గుండెపోటు కూడా వచ్చిందన్నారు. హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా లాక్కేల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపైనా దాడి చేశారని ఆరోపించారు అపర్ణ.

మరోవైపు బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కూడా దీనిపై స్పందించారు. నలభైమంది పోలీసులు తన తండ్రిని చుట్టుముట్టి తీసుకెళ్లారన్నారు భగీరథ్‌. ఎందుకు వచ్చారో.. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదన్నారు. ఆయన్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారని, అరెస్ట్ ఎందుకంటే ప్రివెన్షన్ అని చెప్పినట్ల భగీరథ్ తెలిపారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా నాన్నకు నోటి నుంచి రక్తం వచ్చింది అని భగీరథ్ చెప్పాడు.

లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు..

ఇదిలాఉంటే.. తనను అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు బండి సంజయ్. తనను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి, అరెస్ట్ చేశారని స్పీకర్‌కు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక వాహనంలో తరలింపు..

కరీంనగర్‌లో బండి సంజయ్ ఇంట్లో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రత్యేక వాహనంలో తరలించారు. అయితే, తిమ్మాపూర్ సమీపంలో వాహనం మొరాయించింది. మరో వాహనంలో బొమ్మలరామారం పీఎస్‌కు సంజయ్‌ను తరలించారు. అయితే, సంజయ్‌ని బొమ్మలరామారం పీఎస్‌కు తరలిస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. పీఎస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బండి సంజయ్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. పీఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..