Hyderabad: ‘పక్షి’ని కాపాడేందుకు అర్థరాత్రి హైరిస్క్.. ఆ సాహసాన్ని మీరే చూసేయండి..

Hyderabad: ప్రాణాపాయం చిక్కుకున్న ఓ పక్షి ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందం పడ్డ శ్రమ ఇంత అంత కాదు. చిమ్మచీకటిని సైతం లెక్క చేయకుండా హైరిస్క్ చేశారు అధికారులు.

Hyderabad: ‘పక్షి’ని కాపాడేందుకు అర్థరాత్రి హైరిస్క్.. ఆ సాహసాన్ని మీరే చూసేయండి..
Bird Life Save
Follow us

|

Updated on: Sep 19, 2022 | 7:32 AM

Hyderabad: ప్రాణాపాయం చిక్కుకున్న ఓ పక్షి ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందం పడ్డ శ్రమ ఇంత అంత కాదు. చిమ్మచీకటిని సైతం లెక్క చేయకుండా హైరిస్క్ చేశారు అధికారులు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా, అధికారులు ఎన్ని కేసులు నమోదు చేసిన ప్రజల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రజల నిర్లక్ష్యం వల్ల, అధికారుల అలస్వతం వల్ల వందలాది మూగజీవాలు చైనా మాంజాకి బలై తమ ప్రాణాలు తీసుకుంటున్నాయి. తాజాగా అర్థరాత్రి హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఒక కాకి చైనా మాంజాలో ఇరుకో పోవడంతో స్థానికులు సహాయక బృందానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందం.. సుమారు మూడు గంటల పాటు ఆపరేషన్ చేసి, చివరకు చైనా మాంజలో నుంచి కాకిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు.

ఈ ఘటన స్థానిక ప్రజల హృదయాలను కుదిపివేసింది. ఇకనైనా చైనా మాంజాకు దూరంగా ఉండాలని, ప్రజలు, పక్షుల ప్రాణులను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు చైనా మాంజా అమ్మే వ్యాపారులపై పీడి యాక్ట్ పెట్టి శాశ్వతంగా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..