AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో బుధవారం విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) పలు నిరసన కార్యక్రమాలను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఫీజుల పెంపునకు నిరసనగా పాఠశాలల బంద్‌కు పిలునిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. ఇదిలా ఉంటే తాజాగా...

Telangana: తెలంగాణలో బుధవారం విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
School Closed
Narender Vaitla
|

Updated on: Jul 10, 2023 | 10:53 AM

Share

ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) పలు నిరసన కార్యక్రమాలను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఫీజుల పెంపునకు నిరసనగా పాఠశాలల బంద్‌కు పిలునిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్‌) నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగానే జులై 12వ తేదీన విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది. తాజాగా ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు రకాల అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్‌ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్‌ చేయాలంటూ పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..