AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: రాజేంద్రనగర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. జస్ట్ మిస్.. అదృష్టావశాత్తు ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..

Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.

Accident: రాజేంద్రనగర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. జస్ట్ మిస్.. అదృష్టావశాత్తు ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..
Shiva Prajapati
|

Updated on: Jan 14, 2021 | 8:32 PM

Share

Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు వెళ్లింది. ఆ చిన్నారి టైమ్ బాగుండి కారు టైర్ల మధ్య ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే.. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్ పల్లి, అశోక్ విహార్ పేజ్2లో ఓ ఇంటి ముందు బాలుడు ఆడుకుంటున్నాడు. అపార్ట్‌మెంట్ లోపలి నుంచి గ్జైలో కారు బయటకు వెళ్లింది. అయితే గేటు బయట ఆడుకుంటున్న బాలుడిని డ్రైవర్ గమనించలేదు. అలాగే బాలుడిపై నుంచి కారును వెళ్లనిచ్చాడు.

అదృష్టావశాత్తు ఆ బాలుడు కారు టైర్ల మధ్య ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లు ఆడుకునే సమయంలో జగ్రాత్తగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. ఇదే సమయంలో చిన్న పిల్లలు ఉన్నచోట, నివాస ప్రాంతాల్లో వాహనాలను నిదానంగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.

Also read:

బ్రేకింగ్: కోవిడ్ ఎఫెక్ట్, ఈ సారి గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ చీఫ్ గెస్టులుగా రాబోరు, కేంద్రం ప్రకటన

Breaking: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి..