Breaking: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి..

Parliament Budget Sessions: ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని.. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి...

Breaking: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి..
Parliament Budget Sessions
Follow us

|

Updated on: Jan 14, 2021 | 6:03 PM

Parliament Budget Sessions: ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని.. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది.

కాగా, రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మలి దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్​ 8 వరకు ఉండనుంది. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రతి రోజూ నాలుగు గంటల చొప్పున జరుగుతాయి. గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కరోనా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్​ సెషన్స్​​ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

కోవిడ్ పరిస్థితి కారణంగా ఆర్ధికంగా దెబ్బ తిన్న తర్వాత దేశం తిరిగి వృద్ధి పథంలోకి రావాలని చూస్తున్నతరుణంలో 2021-22 సంవత్సరానికి కేంద్రం రాబోయే బడ్జెట్ ప్రకటనపైనే  అందరి దృష్టి ఉంది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పైన వ్యయం ఎక్కువగా పడింది. పైగా ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి భారీగా ఖర్చు చేయాలని చూస్తుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, కరోనావైరస్ సెస్ లేదా సర్‌చార్జిని ప్రవేశపెట్టే ప్రణాళికపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, భారతదేశంలో అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి కోవిడ్ -19 సెస్ లేదా సర్‌చార్జీని ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తుందని సమాచారం. గత ఏడాది జీఎస్టీ వసూళ్ళు భారీగా తగ్గాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం రాబడులు పెంచుకునేందుకు మార్గాలను వెతుకుతుంది. ఈ క్రామంలోనే సంపన్నులపై అదనంగా కొవిడ్‌ సెస్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు పెట్రోలియం, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టాలని కూడా కేంద్రం యోచిస్తోందని సమాచారం

Also Read: మరోసారి స్వల్పంగా పెరిగిన చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా.!

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు