AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: ఇకపై అందుకోసం ‘ట్రూ కాలర్‌’ అవసరం లేదు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్‌ అసవరం లేకుండానే ఇకపై అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్‌ వివరాలు ఏ యాప్‌ అవసరం లేకుండా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు...

TRAI: ఇకపై అందుకోసం 'ట్రూ కాలర్‌' అవసరం లేదు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం
TRAI
Narender Vaitla
|

Updated on: Jun 29, 2024 | 3:17 PM

Share

అన్‌నోన్‌ నెంబర్స్ నుంచి కాల్స్‌ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్‌ యాప్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి థార్ఢ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్‌ కాల్స్‌కి సంబంధించిన పర్మిషన్స్‌ యాప్‌ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌తో పాటు కాల్‌ వివరాలను సదరు యాప్స్‌కు చేరుతాయి.

అయితే ఇలాంటి సమస్య లేకుండా, అసలు ఏ యాప్‌ అసవరం లేకుండానే ఇకపై అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే కాల్స్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసమే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీకు వచ్చే కాల్స్‌ వివరాలు ఏ యాప్‌ అవసరం లేకుండా స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ట్రాయ్‌.. నేమ్‌ ప్రెజెంటేషన్‌ సర్వీస్‌ను యాక్టివేట్ చేయనుంది. జూలై 15వ తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్‌ ప్రారంభించనుంది.

మోసపూరిత కాల్స్, స్పామ్‌ కాల్స్‌ బారిన పడకుండా ఉండే ఉద్దేశంతో ట్రాయ్‌ ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్‌ ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఈ సేవలు ఎలా పనిచేస్తాయనేగా మీ సందేహం. మీరు సిమ్‌ను కొనుగోలు చేసే సమంలో కేవైసీ ఫామ్‌లో అందించే పేరు ఆధారంగానే పనిచేస్తుంది. ఎవరు కాల్ చేసిన వారి నెంబర్‌ కొనుగోలు సమయంలో ఏ పేరు ఇచ్చారో తెలిసిపోతుంది.

ఇప్పటికే ట్రాయ్‌ ఈ సేవలను ముంబై, హర్యానాలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల నుంచి సత్ఫలితాలు వచ్చిన నేపథ్యంలో దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావి్తున్నారు. దీంతో సైబర్‌ నేరాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే స్విమ్‌ స్వాపింగ్ ఆధారంగా జరుగుతోన్న మోసాలకు కూడా చెక్‌ పెట్టే దిశగా ట్రాయ్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై ఎవరైనా సిమ్‌ పోర్టబుల్ చేసుకుంటే మీ సిమ్‌ కచ్చితంగా 7 రోజుల పాటు డీయాక్టివేట్‌లో ఉండనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..