Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Security: ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీ శిక్షణ అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం

ప్రభుత్వ అధికారుల సైబర్ శక్తికి సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లో శిక్షణ ఇస్తామని అమెరికన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. AIని ఉపయోగించడం, Google క్లౌడ్, మాండియంట్ నిపుణుల నేతృత్వంలో సైబర్‌ సెక్యూరిటీ AI హ్యాకథాన్‌లను నిర్వహించడం వంటివి కలిగి ఉంటుంది." సైబర్ సెక్యూరిటీ గురించి ప్రభుత్వ అధికారులు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత బాగా పని చేయగలుగుతారని తెలిపింది. శిక్షణ వల్ల ఎంతగానో ఉపయోగం ఉందని పేర్కొంది..

Cyber Security: ప్రభుత్వ అధికారులకు సైబర్ సెక్యూరిటీ శిక్షణ అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం
Cyber Security
Follow us
Subhash Goud

|

Updated on: Sep 07, 2023 | 8:41 PM

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికత జనాలకు మరింత చేరువవుతోంది. ఈ సాంకేతిక పెరుగున్నందున నేరాలు, ఇతర మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయనే చెప్పాలి. కొత్త కొత్త టెక్నాలజీని వినియోగించుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసగిస్తున్నారు. వీరి మోసాలకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. దేశంలో వివిధ మార్గాల్లో మోసగాళ్ళు సైబర్ నెట్‌లో సాధారణ ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. దీని కారణంగా చాలా మంది ప్రజలు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. దేశంలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు, ఇతర అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా ఎక్కువవుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్త అప్‌డేట్ వచ్చింది. మోసగాళ్ల ఆటలు సాగనివ్వకుండా చేసేందుకు కొత్త టెక్నాలని ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్‌డేక్‌ ప్రక్రియ ప్రభుత్వ అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి Google క్లౌడ్ CERT-Inతో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని చేసుకుంది.

వాస్తవానికి, గూగుల్ క్లౌడ్ 1,000 మంది ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు ట్రైనీలకు లక్ష సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ స్కాలర్‌షిప్‌లను అందించడానికి ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ అయిన CERT-Inతో జతకట్టింది. ఈ విషయాన్ని గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ గురువారం ప్రకటించింది. CERT-In అనేది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY)లో ఒక భాగం. ఈ మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, హ్యాకింగ్ మరియు ఇతర సైబర్ సంబంధిత సమస్యలను చూస్తుంది.

సైబర్ సెక్యూరిటీ:

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ అధికారుల సైబర్ శక్తికి సైబర్ డిఫెన్స్ బెస్ట్ ప్రాక్టీస్‌లో శిక్షణ ఇస్తామని అమెరికన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. AIని ఉపయోగించడం, Google క్లౌడ్, మాండియంట్ నిపుణుల నేతృత్వంలో సైబర్‌ సెక్యూరిటీ AI హ్యాకథాన్‌లను నిర్వహించడం వంటివి కలిగి ఉంటుంది.” సైబర్ సెక్యూరిటీ గురించి ప్రభుత్వ అధికారులు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత బాగా పని చేయగలుగుతారని తెలిపింది. శిక్షణ వల్ల ఎంతగానో ఉపయోగం ఉందని పేర్కొంది.

డిజిటల్ భవిష్యత్తు:

మరోవైపు సెర్ట్-ఇన్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బెహ్ల్ మాట్లాడుతూ.. సైబర్ భద్రత మన డిజిటల్ భవిష్యత్తుకు మూలస్తంభం. అలాగే జనరేటివ్ AI శక్తిని వినియోగించుకోవడం ఈ నిరంతరం అభివృద్ధి చెందుతున్న ల్యాండ్‌స్కేప్‌లో ముందుకు సాగడంలో మాకు సహాయపడుతుంది అని అన్నారు. అదే సమయంలో రాబోయే సమయం కూడా డిజిటల్‌ను నిరంతరం ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా సైబర్ భద్రత ప్రాముఖ్యత కూడా చాలా పెరిగింది. సైబర్‌ నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉండకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి