AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం చరిత్ర సృష్టించనుందా..? సెమీస్‌ పోరుకు సిద్ధం.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్

ఆగస్టు 3 న జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు నాలుగు ఈవెంట్లలో పాల్గొంటారు. హాకీ, రెజ్లింగ్, జావెలిన్ త్రో, షాట్ పుట్‌లలో అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీం చరిత్ర సృష్టించనుందా..? సెమీస్‌ పోరుకు సిద్ధం.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్
Manpreet Singh
Venkata Chari
|

Updated on: Aug 03, 2021 | 6:59 AM

Share

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ 10 వ రోజు మిశ్రమ ఫలితాలు అందాయి. ఇక 11 వ రోజు కూడా భారతదేశానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి రెజ్లింగ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. వీటిల్లో కనీసం రెండు లేదా మూడు పతకాల కోసం భారతదేశం పోటీపడనుంది. అలాగే హాకీలో పురుషుల జట్టు ఫైనల్‌కు వెళ్లేందుకు ఆడనుంది. బెల్జియంతో సెమీఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, భారతదేశం చరిత్ర సృష్టిస్తుంది. 41 సంవత్సరాలలో మొదటిసారి హాకీలో పతకం అందుకోనుంది. 1980లో చివరిసారి హాకీ టీం స్వర్ణం అందుకుంది. కాబట్టి అథ్లెటిక్స్‌లో మహిళల జావెలిన్ త్రో, పురుషుల షాట్ పుట్ ఈవెంట్ కోసం అర్హత రౌండ్లు ఉంటాయి. ఈ విధంగా ఆగస్టు 3 న, భారత క్రీడాకారులు నాలుగు ఈవెంట్లలో పాల్గొంటారు. ఈ ఆటలలో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

అంతకుముందు ఆగస్టు 2 న మహిళల హాకీ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును 1-0 తేడాతో ఓడించింది. మొదటిసారిగా మహిళల హాకీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. భారత టీం ప్రస్తుతం పతకానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. అదే సమయంలో హార్స్ రైడింగ్‌లో ఫవాద్ మీర్జా చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌కు చేరుకుంది. మొదటిసారి ఒలింపిక్ క్రీడల్లోకి ప్రవేశించింది. అతను ఫైనల్లో 23 వ స్థానంలో నిలిచింది. కానీ, ఇది తనకు గొప్ప విజయం. ఇక షూటింగ్‌లో భారతదేశం దారుణంగా విఫలమైంది. సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వర్య తోమర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అథ్లెటిక్స్‌లో ద్యాతీ చంద్ 200 మీటర్ల రేసు నుంచి నిష్క్రమించింది. డిస్క్‌త్రోలో కమల్‌ప్రీత్ కౌర్ 63.70 మీటర్లు త్రో చేసి ఆరో స్థానంలో నిలిచింది.

షెడ్యూల్ టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత అథ్లెట్ల నేటి షెడ్యూల్..

అథ్లెటిక్స్.. ఉదయం 5.50 గంటలకు: అను రాణి, మహిళల జావెలిన్‌త్రో అర్హత గ్రూప్ ఏ మ్యాచ్ ఉదయం 3.45 గంటలకు: తేజిందర్ పాల్ సింగ్ టూర్, పురుషుల షాట్ త్రో అర్హత గ్రూప్ ఏ మ్యాచ్

హాకీ ఉదయం 7 గంటలకు ఇండియా వర్సెస్ బెల్జియం పురుషుల హాకీ సెమీ ఫైనల్

కుస్తీ ఉదయం 8.30గంటలకు: ఖురెల్ఖు బోలోర్తుయా వర్సెస్ మాలిక్ సోనమ్ ఫ్రీస్టైల్ 62 కేజీలు 1/8 ఫైనల్

Also Read: MS Dhoni: ఆ కంపెనీలో ధోనీ పెట్టుబడులు.. మూడేళ్ల వ్యూహంతో ముందుకు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Anand Mahindra: సింధుకు ఆనంద్‌ మహీంద్ర థార్‌ కారు ఇవ్వాల్సిందే.. నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఆనంద్‌ ఏమన్నారుంటే..