AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: ఒకే క్రీడలో పోటీ పడిన 13 ఏళ్ల బాలికలు.. అరంగేట్రంలోనే పతకాలు.. రికార్డ్ సృష్టించిన అమ్మాయిలు

టోక్యో ఒలింపిక్స్ నాలుగవ రోజు టీనేజ్ ఆటగాళ్లు సందడి చేశారు. ఒకే ఆటలో 13 సంవత్సరాల ఇద్దరు బాలికలు పోటీపడ్డారు. దీంతో ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగింది. కాగా, స్కేట్బోర్డింగ్‌ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టడం విశేషం.

Tokyo Olympics 2020: ఒకే క్రీడలో పోటీ పడిన 13 ఏళ్ల బాలికలు.. అరంగేట్రంలోనే పతకాలు.. రికార్డ్ సృష్టించిన అమ్మాయిలు
street skateboarding
Venkata Chari
|

Updated on: Jul 26, 2021 | 12:35 PM

Share

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ నాలుగవ రోజు టీనేజ్ ఆటగాళ్లు సందడి చేశారు. ఒకే ఆటలో 13 సంవత్సరాల ఇద్దరు బాలికలు పోటీపడ్డారు. దీంతో ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగింది. కాగా, స్కేట్బోర్డింగ్‌ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టడం విశేషం. స్కేట్ బోర్డింగ్‌లో ఫైనల్లో ఈ ఇద్దరు అమ్మాయిలు తలపడ్డారు. ఇందులో జపాన్‌కు చెందిన నిషియా మోమిజీ బంగారు పతకం గెలుచుకోగా, బ్రెజిల్‌కు చెందిన రైసా లీల్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన జపాన్‌కు చెందిన తొలి మహిళా స్కేట్‌బోర్డర్ నిషియా మోమోజీ రికార్డు నెలకొల్పారు.

మహిళల స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో జపాన్ కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. జపాన్‌కు చెందిన 18 ఏళ్ల ఫూనా నకయామా ఈ పతకాన్ని గెలుచుకుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఇది మొదటి ఒలింపిక్స్. మొట్టమొదటి ఒలింపిక్స్‌లో, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. తమ దేశానికి పతకం సాధించి చరిత్ర సృష్టించారు.

స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన అనంతరం జపాన్‌కు చెందిన నిషియా మోమోజీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం మోమోజీకి ఎంతో ముఖ్యం. అలాగ ఈ క్రీడలో తొలిసారి పాల్గొని బంగారు పతకం సాధించడంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. మరోవైపు, మహిళల స్కేట్‌బోర్డింగ్‌లో రజత పతకం సాధించిన బ్రెజిలియన్ రైసా లీల్.. తన 8 వ ఏట నుంచే తన ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. 5 సంవత్సరాల కృషికి ఫలితంగా ఈ రోజు ఒలింపిక్స్‌లో పతకం గెలిచి, చరిత్ర సృష్టించింది. రైసా లీల్‌ను బ్రెజిల్‌లో స్కేట్బోర్డింగ్ రాణి అని పిలుస్తుంటారు. అతను 2015 సంవత్సరంలో స్కేట్బోర్డింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Also Read:

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ.. ఇంటిముఖం పట్టిన పురుషుల ఆర్చరీ టీం

Tokyo Olympics 2020 Live: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ రాంకిరెడ్డి జోడీ ఓటమి.. క్వార్టర్ ఫైనల్లో ముగిసిన పురుషుల ఆర్చరీ ప్రయాణం!