Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

President Ram Nath Kovind: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Follow us

|

Updated on: Feb 24, 2021 | 10:13 AM

President Ram Nath Kovind: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ రోజు 11.30 గంటలకు రాజ్‌భవన్ నుంచి నేరుగా మెతెరాలోలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియానికి చేరుకోని రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పట్లు చేశారు. దీని ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను రాష్ట్రపతి కోవింద్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రపతి కోవింద్ ఢిల్లీకి పయనమవుతారు.

అహ్మదాబాద్‌లోని మోతెరా సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం ఈ రోజు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంగ్లండ్-‌భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో.. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మూడో టెస్టు రెండు జట్లకు కీలకంగా మారింది.

Also Read:

India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..

Virat Kohli: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో టీమిండియా రథసారధి.. మొటెరా టెస్ట్‌లో ఇది సాకారం కానుందా.?