AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoaib Malik: ‘మనసు ఏం చెబితే అదే చేయండి’.. ట్రోలింగ్‌పై పరోక్షంగా స్పందించిన షోయబ్‌

జనవరి 20న షోయబ్‌ మూడో వివాహం చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా షోయబ్‌పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. షోయబ్‌ పచ్చి మోసగాడంటూ, సానియాపై సింపతి చూపిస్తున్నారు. దీంతో షోయబ్‌పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది...

Shoaib Malik: 'మనసు ఏం చెబితే అదే చేయండి'.. ట్రోలింగ్‌పై పరోక్షంగా స్పందించిన షోయబ్‌
Shoaib Malik
Narender Vaitla
|

Updated on: Jan 29, 2024 | 8:34 PM

Share

పాకిస్థాన్‌ మాజీ క్రికెట్ షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి వ్యవహారం చర్చనీయాంశంగామారిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌ నటి సనా జావేద్‌ను షోయబ్‌ పెళ్లి చేసుకోవడంతో నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే షోయబ్‌ మాజీ భార్య టెన్నిస్ స్టార్‌ సానియాకు పాకిస్థాన్‌ ప్రజల నుంచి మద్ధతు లభిస్తోంది. షోయబ్‌-సనాతో రిలేషన్‌లో ఉంటూ సానియాను మోసం చేశాడని పాకిస్థాన్‌ మీడియా కథనాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

జనవరి 20న షోయబ్‌ మూడో వివాహం చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా షోయబ్‌పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. షోయబ్‌ పచ్చి మోసగాడంటూ, సానియాపై సింపతి చూపిస్తున్నారు. దీంతో షోయబ్‌పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది. అయితే దీనిపై షోయబ్‌ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అఇయతే తాజాగా నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై ఓపెన్‌ అయ్యారు. అయితే నేరుగా కాకుండా, పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు షోయబ్‌.

View this post on Instagram

A post shared by AK BUZZ (@akbuzzofficial)

పాడ్‌కాస్ట్‌లో హోస్ట్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘మీ మనసు మీకు ఏం చెబుతుందో అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు. మీరు ప్రయాణం చేస్తుంటే, ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవడానికి మీకు ఏళ్లు పట్టొచ్చు. అయినా ముందుకు సాగండి. ఇందుకు మీకు 10 ఏళ్లు పట్టొచ్చు లేదా 20 ఏళ్లు పట్టొచ్చు. 20 ఏళ్ల తర్వాత అర్థం చేసుకున్నప్పటికీ ముందుకుసాగండి’ అని చెప్పుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో జరుగుతోన్న నెగిటివిటీపై నేరుగా స్పందించకపోయిన్పటికీ, పాడ్‌క్యాస్ట్‌లో షోయబ్ మాటలు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా, మనస్సును అనుసరించాలనే దృఢమైన వైఖరిని చెబుతున్నాయి. ఏది ఏమైనా షోయబ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..