AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birmingham 2022: ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాం.. కచ్చితంగా పతకం గెలుస్తాం: హాకీ కెప్టెన్ మన్‌దీప్ సింగ్

ఇది జట్టుకు నేర్చుకునే అవకాశంలా మారింది. మేం న్యూజిలాండ్‌పై బాగానే ఆడాం. కానీ ఓడిపోయాం. కాంస్య పతకాన్ని కూడా గెలవలేకపోయాం. ఆ సమయంలో మేం చేసిన తప్పులు..

Birmingham 2022: ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాం.. కచ్చితంగా పతకం గెలుస్తాం: హాకీ కెప్టెన్ మన్‌దీప్ సింగ్
Birmingham 2022 Mandeep Singh
Venkata Chari
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 19, 2022 | 3:35 PM

Share

కామన్వెల్త్ క్రీడలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. భారత పురుషుల హాకీ జట్టు బెంగళూరులో ఫైనల్ ప్రాక్టీస్ చేస్తోంది. గోల్డ్ కోస్ట్‌లో నాల్గవ స్థానంలో నిలిచిన తర్వాత, పురుషుల జట్టు బర్మింగ్‌హామ్‌లో పతకాన్ని సాధించాలని కోరుకుంటోంది. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని కోరుకుంటోంది. కాగా, ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ సమయంలో అమిత్ రోహిదాస్ జట్టును కొద్ది కాలం పాటు నడిపించిన తర్వాత మన్‌ప్రీత్ సింగ్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలో భారత్ జులై 31న ఘనాతో తన CWG ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత పూల్ గేమ్‌లలో ఆతిథ్య ఇంగ్లాండ్, కెనడా, వేల్స్‌తో తలపడుతుంది.

మెగా ఈవెంట్‌కు ముందు, ఇండియన్ టీమ్ ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్ కామన్ వెల్త్ గేమ్స్ కోసం జట్టు సన్నద్ధతపై న్యూస్ 9 స్పోర్ట్స్‌తో మాట్లాడాడు.

వ్యక్తిగత ప్రదర్శనపై మాట్లాడుతూ, జట్టు కోసం ఫార్వర్డ్ ప్రెస్సింగ్, స్కోరింగ్ వంటి అంశాలలో నేను చాలా మెరుగుపడ్డాను. గత ఆరు-ఏడేళ్లలో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సృష్టించడంతోపాటు ఈ రెండు అంశాలపై నేను చాలా కృషి చేశానంటూ తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఓటమిపై.. ఇది జట్టుకు నేర్చుకునే అవకాశంలా మారింది. మేం న్యూజిలాండ్‌పై బాగానే ఆడాం. కానీ ఓడిపోయాం. కాంస్య పతకాన్ని కూడా గెలవలేకపోయాం. ఆ సమయంలో మేం చేసిన తప్పులు… తర్వాతి సంవత్సరాల్లో అధిగమించాం. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించాం. దాంతో మాకు పతకం దక్కిందిం. రాబోయే కామన్వెల్త్ క్రీడల కోసం, జట్టుగా కష్టపడి పతకాన్ని సాధించాలని చూస్తున్నట్లు తెలిపాడు.

2019 సుల్తాన్ అజ్లాన్ షా కప్ ప్రదర్శనపై.. సుల్తాన్ అజ్లాన్ షా కప్ మంచి టోర్నమెంట్. నా జట్టు కోసం గోల్స్ చేయాలనేది నా మనస్సులో ఉంది. నేను వ్యక్తిగతంగా స్కోర్ చేయలేకపోతే, నేను ఇతరులకు స్కోరింగ్ అవకాశాలను సృష్టిస్తాను. దాంతోనే తప్పులు చేయకుండా ముందుకు సాగాం. అందుకే అత్యధిక స్కోరర్‌గా నిలిచాను అంటూ చెప్పుకొచ్చాడు.

కోవిడ్-19 పరిస్థితులపై, ఈ మహమ్మారి ప్రారంభ దశలో నేను COVID-19 బారిన పడ్డాను. దాదాపు 15 రోజులు లేదా ఒక నెల పాటు మా గదులలో ఉండిపోయాం. టోర్నమెంట్‌లు లేకపోవడంతో ప్రాక్టీస్ కూడా కష్టమైంది. ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేశారు. పతకం కావాలంటే ప్రాక్టీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. ఆ కాలంలో జట్టు బంధం గణనీయంగా మెరుగుపడింది. అది చివరికి ఒలింపిక్స్‌లో మాకు సహాయపడింది.

భారత ప్రో లీగ్‌పై.. ప్రో లీగ్ వంటి టోర్నమెంట్లు నిర్వహించాలని నేను భావిస్తున్నాను. మేం ఈ ఆటల నుంచి చాలా పాఠాలు తీసుకుంటాం. మనం ఒక అంశంలో తప్పు చేస్తే, తదుపరి శిబిరంలో దాన్ని సరిదిద్దుకోవడానికి, మైదానంలో అమలు చేయడానికి, మా ఆటను మెరుగుపరచడానికి మాకు సమయం ఉంది. మేం పొరపాటు చేస్తే, తదుపరి రెండు గేమ్‌ల వరకు మాకు సమయం ఉంటుంది. మా ఆటను మెరుగుపరచుకోవడానికి, అనుభవాన్ని పొందేందుకు మాకు సమయం ఉందని తెలిపాడు.

ఘనాతో ప్రారంభ మ్యాచ్‌పై.. తొలిసారి ఘనాతో ఆడబోతున్నాం. వారి ఆట తీరు గురించి మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ, మేం మా ఆటపై దృష్టి పెడతాం. బేసిక్స్‌ను బలంగా ఉంచుతూ మన ఆట నిర్మాణం, శైలి గురించి స్థిరంగా ఉండేలా చూసుకుంటాం. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మ్యాచ్‌లవారీగా మా ప్రణాళికలతో ముందుకు వెళ్తాం.

ప్రపంచ వేదికపై ఆస్ట్రేలియా బలాలపై.. మేం వారితో ఆడినప్పుడల్లా ఆస్ట్రేలియా ఎల్లప్పుడూ మాకు మంచి పోరాటాన్ని అందిస్తుంది. వారి ఫార్వర్డ్ లైన్, డిఫెన్స్ చాలా బాగున్నాయి. వాటిని ప్లే చేయడంలో మాకు కొన్ని సరికొత్త ప్లాన్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఈ CWGలో, మేం వారికి మంచి పోరాటం ఇవ్వాలని చూస్తున్నాం. కచ్చితంగా మెడల్ తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.