Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్సిప్లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్..
Mary Kom: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బాక్సర్ మేరీకోమ్(51 కిలోలు)కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని...
దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బాక్సర్ మేరీకోమ్కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో కజకిస్థాన్కు చెందిన నాజీమ్ కైజాయ్పై 2-3తో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బాక్సర్ మేరీకోమ్(51 కిలోలు)కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.
ఇక బాక్సింగ్ 51 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన కైజాయ్కు 10 వేల డాలర్ల(రూ.7.23 లక్షలు) బహుమానం లభించగా.. రజత పతకం సాధించిన మేరీకోమ్కు 5వేల డాలర్లు లభించింది. నాజీమ్ కైజాయ్ ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్గా.. ఆరుసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో సోమవారం పురుషుల విభాగంలో ఫైనల్స్ జరగనున్నాయి. ఇందులో భారత బాక్సర్లు అమిత్ పంగాల్ (52 కిలోలు), శివ థాపా(64 కిలోలు), సంజీత్(91 కిలోలు) పోటీపడనున్నారు.