AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్‌న్యూస్: లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో కీలక ఒప్పందం!

AP Midday Meal Scheme: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యం, పోషకాహార భోజనం అందిస్తున్నారు. మెనూ మార్పులతో ఎక్కువ మంది భోజనం చేస్తున్నారు. భోజనం రుచి, శుచిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అదనంగా, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అమలవుతున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులకు గుడ్‌న్యూస్: లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో కీలక ఒప్పందం!
Ap Midday Meals
Rajashekher G
|

Updated on: May 04, 2026 | 1:24 PM

Share

ఉండవల్లి: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్న బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువమంది భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచి, శుచిగా వడ్డించేలా విద్య, ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమం మరో మూడేళ్లు కొనసాగింపునకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరో మూడేళ్లు..

ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగి-జావ పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ తో కాలపరిమితి ముగిసింది. దీంతో పొడిగింపునకు విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.

పోషకాహార విలువలు..

ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోనల్ వారీగా విద్యార్థులకు మెనూ అమలుచేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి 5 సార్లు గుడ్డు, వారానికి మూడు సార్లు చిక్కీ, అలాగే పోషకాహారపు పదార్థులుగా చిక్కీలేని రోజుల్లో రాగిజావను వారానికి మూడు సార్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లు ఖర్చుచేస్తోంది. తద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, అటెండెన్స్, డ్రాప్ అవుట్స్ నివారణ, పోషకస్థాయిలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సాయి ట్రస్ట్ ఉచితంగానే..

విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్‌గా రాగిజావను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 మిల్లీలీటర్ల వేడినీటిలో కలిపి విద్యార్థులకు అందించడం జరుగుతోంది. తద్వారా కాల్షియం, ఐరన్‌తో సమృద్ధిగా ఉండి పోషకాహారాన్ని మెరుగుపరుస్తుంది. రాగిపిండి, బెల్లంపొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఇందుకోసం మూడేళ్లలో రూ.80 కోట్ల వరకు వెచ్చించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్ ఎస్.జి చలం, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు ఆర్.లక్ష్మణరావుతో పాటు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ ఆర్.ఎస్ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.

Follow Us