ముంబై కు మరో ఎదురు దెబ్బ..!
ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇక ఈరోజు ముంబై ఇండియన్స్ -రాయల్ ఛాలెంజర్స్ మధ్య బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్ కు బుమ్రా దూరం అవనున్నట్లు తెలుస్తోంది. జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నా.. బుమ్రా బౌలింగ్ సాధన చేయలేదని తెలుస్తోంది. అతనికి మరింత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. కాగా ఆదివారం ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ […]
ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇక ఈరోజు ముంబై ఇండియన్స్ -రాయల్ ఛాలెంజర్స్ మధ్య బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే గాయం కారణంగా ఈ మ్యాచ్ కు బుమ్రా దూరం అవనున్నట్లు తెలుస్తోంది. జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నా.. బుమ్రా బౌలింగ్ సాధన చేయలేదని తెలుస్తోంది. అతనికి మరింత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
కాగా ఆదివారం ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. దీనితో అతను మ్యాచ్ మధ్యలోనే మైదానం విడిచి పెట్టాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాకు కొద్ది రోజులు విశ్రాంతి లభిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.