AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC ఫైనల్ నుంచి 4 జట్లు ఔట్.. మరో 3 జట్లు కూడా.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

WTC Final 2027: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో సైకిల్ తుది దశకు చేరుకుంటున్న వేళ పాయింట్ల పట్టిక సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. లండన్‌లోని ప్రసిద్ధ ఓవల్ మైదానం వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 పోరు కోసం ప్రధాన జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే కొన్ని జట్లు రేసు నుంచి పూర్తిగా తప్పుకోగా, అగ్రస్థానం కోసం కీలక జట్ల మధ్య అసలైన సమరం మొదలైంది.

WTC ఫైనల్ నుంచి 4 జట్లు ఔట్.. మరో 3 జట్లు కూడా.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
Wtc Final 2027 Race
Venkata Chari
|

Updated on: Aug 21, 2026 | 3:56 PM

Share

WTC Final 2027: ఐసీసీ టెస్టు క్రికెట్ సమరాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 తుది పోరుకు రంగం సిద్ధమవుతోంది. లండన్‌లోని ప్రఖ్యాత ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మెగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఫైనల్ చేరాలంటే కనీసం 65 శాతం పాయింట్ల శాతం (PCT) సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా (77.78% PCT), రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (75.00% PCT), మూడో స్థానంలోని న్యూజిలాండ్ (72.22% PCT) పటిష్టమైన స్థితిలో ఉన్నాయి. మరో 13 టెస్టులు ఆడాల్సిన ఆసీస్‌తో పాటు, చేతిలో పది టెస్టుల చొప్పున ఉన్న సఫారీలు, కివీస్ జట్లు ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు గట్టి పోటీనిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?

వెస్టిండీస్ నిష్క్రమణ.. ఆ మూడు జట్లకు కష్టమేగా..

ఈసారి లీగ్ దశలో వెస్టిండీస్ ప్రయాణం దాదాపు ముగిసింది. ఆడిన 12 టెస్టుల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి 20.83% PCTతో తొమ్మిదో స్థానానికి పడిపోయిన కరీబియన్ జట్టుకు మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచినా ముందంజ వేసే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి

మరోవైపు పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక జట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఖాతాలో 22.22% PCT మాత్రమే ఉంది. ఆ జట్టు ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 7 టెస్టుల్లో దాదాపు అన్నింట్లోనూ విజయం సాధించాల్సిందే. 13 మ్యాచ్‌లాడి 24.36% PCTతో ఉన్న ఇంగ్లండ్‌కు మిగిలిన ఎనిమిది టెస్టులు గెలిచినా అగ్రస్థానాలకు చేరుకోవడం కష్టమే. భారత్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక 33.33% PCTతో నిలిచి, మిగిలిన 7 టెస్టులను తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో పడింది.

రేసులో నిలిచిన బంగ్లాదేశ్.. టీమిండియా ముందున్న సమీకరణాలు..

ఈ సైకిల్‌లో అనూహ్యంగా పుంజుకున్న బంగ్లాదేశ్ డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి 66.67% PCTతో నాలుగో స్థానానికి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. చేతిలో మరో ఏడు టెస్టులు ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఇక టీమిండియా ఇప్పటివరకు ఆడిన పది టెస్టుల్లో ఐదు విజయాలు సాధించి 53.33% PCTతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 18 టెస్టుల షెడ్యూల్‌లో మిగిలిన ఎనిమిది మ్యాచుల్లో నిలకడగా రాణిస్తేనే భారత జట్టు వరుసగా మరోసారి ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

మొత్తం తొమ్మిది జట్లలో వెస్టిండీస్ అధికారికంగా నిష్క్రమించగా, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంకలకు దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. మిగిలిన ఐదు జట్లలో టాప్-2 స్థానాలను దక్కించుకుని ఓవల్ మైదానంలో టెస్టు గదను ముద్దాడేది ఎవరో రానున్న సిరీస్‌లే తేల్చనున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us