AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఉచితంగా టికెట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

డబ్ల్యూపీఎల్ 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా నిర్వహించబడుతున్న దృష్ట్యా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం నాడు టిక్కెట్లు ఉచితంగా అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

WPL 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఉచితంగా టికెట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Wpl 2023
Venkata Chari
|

Updated on: Mar 07, 2023 | 11:48 AM

Share

డబ్ల్యూపీఎల్ 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా నిర్వహించబడుతున్న దృష్ట్యా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం నాడు అంటే మార్చి 8, 2023న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికే మహిళలకు టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు. అన్ని వయసుల మహిళలకు ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించేందుకు అనుమతించారు. కేవలం పురుష ప్రేక్షకులు మాత్రమే రూ. 100 నుంచి రూ. 400ల వరకు టిక్కెట్లు తీసుకోవాల్సి వచ్చేది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్త్రీ, పురుషులిద్దరికీ టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

WPL 2023 నాల్గవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 వికెట్ల తేడాతో సులభంగా ఓడించి రెండవ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. జవాబుగా ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో 159/1 స్కోరు చేసి విజయం సాధించింది. దీంతో టోర్నీలో ఆర్‌సీబీ వరుసగా రెండో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు, గుజరాత్ జెయింట్స్ గురించి మాట్లాడితే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..