AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కొత్త తేదీ ఫిక్స్! షెడ్యూల్‌లో మరిన్ని మార్పులు..

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు...

World Cup 2023: ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కొత్త తేదీ ఫిక్స్! షెడ్యూల్‌లో మరిన్ని మార్పులు..
India Vs Pakistan
Basha Shek
|

Updated on: Jul 31, 2023 | 6:33 PM

Share

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేశారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ఇండియా టుడే నివేదించింది. దీని ప్రకారం అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇండో-పాక్ షెడ్యూల్ మారిన నేపథ్యంలో మిగిలిన కొన్ని మ్యాచ్ ల షెడ్యూల్ లో మార్పు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులతో ఆగస్ట్ 31న కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.

నవరాత్రి ఉత్సవాలతో..

అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్‌లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా గర్బా సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేస్తారు. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని స్టేడియం సామర్థ్యం లక్షకు పైగా ఉంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం స్టేడియం కిక్కిరిసిపోతుంది. అందువల్ల స్టేడియం చుట్టూ మరింత మంది పోలీసులను మోహరించాలి. గుజరాత్ అంతటా గర్బా కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ కూడా పోలీసులను మోహరించాలి. ఒకే రోజు అన్నిచోట్లా తగిన పోలీసు భద్రత కల్పించడం కష్టమని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. అందుకే మ్యాచ్‌ తేదీని రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐకి వినతి పత్రం సమర్పించారు.

ఆసీస్‌తో మ్యాచ్‌..

అక్టోబరు 14న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి లేఖ రాసింది. దీని ప్రకారం ఆదివారం కాకుండా శనివారం మ్యాచ్ నిర్వహించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా