AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?

Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. దీనికి కారణం ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి కెప్టెన్ వారి దృష్టి నాపై ఉంటుందని తెలిపాడు.

Video: ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
Rohit Sharma BowlingImage Credit source: BCCI X
Venkata Chari
|

Updated on: May 03, 2024 | 5:01 PM

Share

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఆఫ్ స్పిన్నర్ లేకుండానే భారత జట్టు ఈ ప్రపంచకప్‌నకు వెళ్లనుంది. ఇటువంటి పరిస్థితిలో, విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మను విలేకరులు ఇదే ప్రశ్న అడిగారు. దీనిపై 37 ఏళ్ల ఆటగాడు చేయి పైకెత్తి తాను కూడా బౌలింగ్ చేయగలనని సూచించాడు.

రోహిత్ సమాధానం విని నవ్వేసిన జర్నలిస్టులు..

రోహిత్ శర్మ చేసిన ఈ సంజ్ఞ చూసి విలేకరులు నవ్వడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక రోహిత్ శర్మ టీమిండియా స్పిన్నర్ల గురించి మాట్లాడాడు. 3-4 స్పిన్నర్లను కోరుకున్నది నేనే అని రోహిత్ చెప్పాడు. ఇందులో ప్రపంచకప్‌నకు ముగ్గురు పేసర్లు కావాలనుకున్నాను. రోహిత్ శర్మ వాషింగ్టన్ సుందర్ గురించి కూడా మాట్లాడాడు. సుందర్ పెద్దగా క్రికెట్ ఆడడం లేదు. కాబట్టి జట్టుకు అశ్విన్‌ను ఎంపిక చేశారు. కానీ, అక్షర్ పటేల్ అద్భుతమైన ఆటతీరుతో ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

జట్టులో నలుగురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను చేర్చుకోవడంపై నేనే మాట్లాడానని రోహిత్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్, చాహల్ కలిసి ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంత మంది స్పిన్నర్లను ఎందుకు ఆడించాడో వివరించేందుకు రోహిత్ నిరాకరించాడు. ప్రపంచకప్‌ వ్యూహాన్ని ఇతర కెప్టెన్‌లకు వెల్లడించడం తనకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. దీనికి కారణం ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి కెప్టెన్ వారి దృష్టి నాపై ఉంటుందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..