AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ఆఫ్ఘానిస్తాన్‎తో మ్యాచ్‎కు సిద్ధమవుతోన్న భారత్.. నెట్స్‎లో చెమటోర్చిన ఆటగాళ్లు..

Virat Kolhi : టీ20 ప్రపంచకప్‌లో విజయం కోసం భారత్ ఎదురుచూస్తోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన తర్వాత ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఆఫ్ఘాన్‎ను ఇండియా తక్కువ అంచనా వేయడం లేదు.

T20 World Cup 2021: ఆఫ్ఘానిస్తాన్‎తో మ్యాచ్‎కు సిద్ధమవుతోన్న భారత్.. నెట్స్‎లో చెమటోర్చిన ఆటగాళ్లు..
Kohli
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Nov 03, 2021 | 2:04 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో విజయం కోసం భారత్ ఎదురుచూస్తోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన తర్వాత ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఆఫ్ఘాన్‎ను ఇండియా తక్కువ అంచనా వేయడం లేదు. అందుకే భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‎లో తీవ్రంగా శ్రమించారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెమటలుపట్టేలా ప్రాక్టీస్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‎ మ్యాచ్‎లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని టీం ఇండియా భావిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‎లో గెలిస్తేనే సెమీస్‎ ఆశలు సజీవంగా ఉంటాయి.

ఆఫ్ఘానిస్తాన్ టీం కూడా ప్రస్తుతం చిన్న జట్టులా కాకుండా తన పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ టీంకు కూడా చెమటలు పట్టించింది. బుధవారం (నవంబర్ 3) అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆఫ్గాన్, ఇండియా పోరు జరగనుంది. అక్టోబర్ 24న పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ 10 వికెట్లతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‎ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఆ మ్యాచ్‎లో భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారత్ 151 పరుగులు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక గత ఆదివారం కివీస్‏తో జరిగిన మ్యాచ్‎లో 110 పరుగులకే అలౌట్ అయింది. ఈ మ్యాచ్‎ ఓటమితో ఇండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రూప్-2లోనాలుగు విజయాలు సాధించిన పాకిస్తాన్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి నమీబియాను ఓడించి నాకౌట్‌లో బెర్త్ దక్కించుకుంది. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే భారత్‌కు సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం లేదు. ఇండియా తర్వాతి మూడు మ్యాచ్‎ల్లో భారీ తేడాతో విజయం సాధించి.. న్యూజిలాండ్ ఆఫ్ఘానిస్తాన్, నమీబియా, స్కాట్‎లాండ్‎తో జరిగే మ్యాచ్‎ల్లో ఒకదాట్లో ఓడిపోతే ఇండియా సెమీస్ చేరుతుంది. లేకుంటే ఇంటికి వెళ్తుంది.

Read Also.. Shubman Gill : ఏంటి.. సారాతో బ్రేకప్‌ అయ్యిందా.. అనుమానాలు రేకెత్తిస్తోన్న శుభ్‌మన్‌ గిల్‌ ఇన్‌స్టా పోస్ట్‌..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు