Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ లిస్ట్లోనూ తోపే..
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న కీలక పోరులో కేవలం 16 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటు బ్యాటింగ్లో అదరగొడుతూనే, అటు ఆరెంజ్ క్యాప్ రేసులోనూ తన ముద్ర వేస్తూ పంజాబ్ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు.

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రత్యుత్తరంగా, వైభవ్ మొదటి ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు బాది తన ఉద్దేశ్యాన్ని చూపించాడు. అర్ష్దీప్ వేసిన మూడో బంతికి అతను ఒక భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదాడు. వైభవ్ మొదటి ఓవర్లో 14 పరుగులు పిండుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభం నుండే వైభవ్ సూర్యవంశీ తన దూకుడును ప్రదర్శించాడు. పంజాబ్ బౌలర్లు వేస్తున్న బంతులను మైదానం నలుమూలలా బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ వంటి సీనియర్ బౌలర్లను సైతం లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ ఆడిన తీరు చూస్తుంటే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల సునామీ వచ్చిందా అన్నట్లుగా ఉంది.
16 బంతుల్లోనే విధ్వంసకర గణాంకాలు..
𝙔𝙚𝙝 𝙖𝙡𝙖𝙜 𝙝𝙞 𝙡𝙚𝙫𝙚𝙡 𝙠𝙖 𝙗𝙖𝙣𝙙𝙖 𝙝𝙖𝙞🔥#VaibhavSooryavanshi apne khaas andaaz mein ek aur dhamakedaar shuruaat. 👊🏻#TATAIPL 2026 ➡️ #PBKSvRR | LIVE NOW 👉https://t.co/saW6caCqT8 pic.twitter.com/0rtoFh4s2o
— Star Sports (@StarSportsIndia) April 28, 2026
ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 3 అద్భుతమైన ఫోర్లు ఉన్నాయి. సుమారు 268.75 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన వైభవ్, పంజాబ్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరికి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగినప్పటికీ, అప్పటికే చేయాల్సిన నష్టం చేసేశాడు.
జైస్వాల్తో కలిసి ధనాధన్ బ్యాటింగ్..
మరోవైపు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా వైభవ్కు తోడై ధాటిగా ఆడాడు. జైస్వాల్ కేవలం 7 బంతుల్లోనే 21 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ రాయల్స్ కేవలం 4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 66 పరుగులు జోడించింది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు గెలవాలంటే ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది.
ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న వైభవ్..
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ నిలకడగా రాణిస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో (ఆరెంజ్ క్యాప్ లిస్ట్) తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. యువ ఆటగాడైనప్పటికీ సీనియర్లతో పోటీపడుతూ మ్యాచ్ విన్నర్గా మారుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే టీమ్ ఇండియా తలుపులు తట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ వైభవ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
