Video: 6,6,6,6.. మొన్న డకౌట్ చేసినోడికి ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ.. షాకైన కావ్యపాప
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పరుగుల విధ్వంసం సృష్టించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ 15 ఏళ్ల కుర్రాడు అనుభవజ్ఞుడైన బౌలర్ ప్రఫుల్ హింజే బౌలింగ్లో వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. గత మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ జైపూర్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.

Vaibhav Suryavanshi: జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం సాక్షిగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న 36వ లీగ్ మ్యాచ్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా, రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. తొలి బంతికే జైస్వాల్ సింగిల్ తీసి వైభవ్కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. రెండో బంతికి బీట్ అయిన వైభవ్, ఆ తర్వాత ఏమాత్రం కనికరం చూపకుండా బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు.
వరుసగా నాలుగు సిక్సర్లు: ప్రతీకారం తీర్చుకున్న యువ కిశోరం..
గత మ్యాచ్లో ప్రఫుల్ హింజే బౌలింగ్లోనే డకౌట్ అయిన వైభవ్, ఈసారి మాత్రం ప్రతీకారేచ్ఛతో కనిపించాడు. ఓవర్ మూడో బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్టాండ్స్లోకి పంపిన వైభవ్, తన పరుగుల ఖాతాను సిక్సర్తో ప్రారంభించాడు. ఆ తర్వాతి బంతిని కూడా అదే దిశలో భారీ సిక్సర్గా మలిచి ‘బ్యాక్ టు బ్యాక్’ సిక్సర్లను నమోదు చేశాడు. ఐదో బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్గా మలచడంతో సిక్సర్ల హ్యాట్రిక్ పూర్తయింది. చివరి బంతికి కూడా లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్ బాదడంతో ఒకే ఓవర్లో 25 పరుగులు వచ్చాయి.
స్టేడియంలో సిక్సర్ల మోత..
Clearing old debts and opening new accounts 👊
🎥 Vaibhav Sooryavanshi is dealing in fireworks 🔥
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @rajasthanroyals pic.twitter.com/zTRbvv0viN
— IndianPremierLeague (@IPL) April 25, 2026
కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్లో ఇలాంటి ప్రదర్శన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా మూడో సిక్సర్ స్టేడియం పైకప్పు మీద పడటంతో అభిమానులు స్టాండ్స్ నుంచి కేరింతలు కొట్టారు. బంతి బ్యాట్ మధ్యలో తగలకపోయినా, తనకున్న అపారమైన శక్తితో బంతిని బౌండరీ లైన్ దాటించడం వైభవ్ ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు కేవలం 1.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది.
సన్రైజర్స్పై ఒత్తిడి..
తొలి ఓవర్లోనే భారీగా పరుగులు సమర్పించుకోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. వైభవ్ ధాటికి పాట్ కమిన్స్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ చూస్తుంటే నేడు పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ తన పునరాగమనాన్ని అద్భుతమైన రీతిలో చాటుకుని తన జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
