AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం Vs సాయంత్రం.. మొక్కలకు నీళ్లు ఎప్పుడు పోయాలి..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

వేసవి మనుషులకే కాదు, మనం పెంచే మొక్కలకు కూడా పెద్ద పరీక్షా సమయం. భానుడి సెగలకు నేల ఎండిపోతూ, మొక్కలు ప్రాణం కోల్పోతున్నట్లు కనిపిస్తుంటాయి. వాటిని కాపాడుకోవాలని మనం పోసే నీరు ఒక్కోసారి శాపంగా మారుతుంటుంది. అసలు మొక్కలకు నీరు ఎప్పుడు పోయాలి? ఉదయాన్నే పోస్తే కలిగే లాభాలేంటి? సాయంత్రం వేళల్లో ఉండే రిస్క్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

ఉదయం Vs సాయంత్రం.. మొక్కలకు నీళ్లు ఎప్పుడు పోయాలి..? ఈ తప్పులు అస్సలు చేయకండి..
Best Time To Water Plants In Summer
Krishna S
|

Updated on: Apr 25, 2026 | 7:54 PM

Share

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు మనుషులమే కాదు, మూగజీవాలైన మొక్కలు కూడా విలవిల్లాడుతున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, పొడి గాలుల వల్ల నేలలోని తేమ ఆవిరైపోయి మొక్కలు వాడిపోతుంటాయి. ఈ క్రమంలో చాలామంది మొక్కలను కాపాడుకోవడానికి విపరీతంగా నీరు పోస్తుంటారు. అయితే, అతిగా నీరు పోయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని మీకు తెలుసా? వేసవిలో మొక్కలకు నీరు ఎప్పుడు పోయాలి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఉదయం పూట నీరు పోయడం వల్ల కలిగే మ్యాజిక్

మొక్కలకు నీరు పెట్టడానికి ఉదయం సమయం అత్యంత ఉత్తమమైనది. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది.. ఉదయం పూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల మనం పోసే నీరు ఆవిరైపోకుండా, నెమ్మదిగా మట్టిలోకి ఇంకి వేర్లకు చేరుతుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ రాకముందే మొక్కలు తగినంత తేమను గ్రహిస్తాయి. దీనివల్ల అవి రోజంతా వేడిని తట్టుకుని నిలబడగలుగుతాయి. ఉదయం పూట ఆకులపై పడే నీరు ఎండ వల్ల త్వరగా ఆరిపోతుంది. దీనివల్ల మొక్కలకు శిలీంధ్రాల సంక్రమణ లేదా వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం తగ్గుతుంది.

సాయంత్రం పూట నీరు పోయవచ్చా..?

తీవ్రమైన ఎండ ఉన్న రోజు తర్వాత సాయంత్రం నీరు పోయడం మొక్కలకు ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఇందులో ఒక చిక్కు ఉంది. రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు కాబట్టి ఆకులపై లేదా మట్టిలో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ఇలా తేమ ఎక్కువగా ఉండటం వల్ల శిలీంధ్రాలు, తెగుళ్లు చేరే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం నీరు పోయాల్సి వస్తే, మరీ పొద్దుపోయాక కాకుండా కొంచెం వెలుతురు ఉండగానే పోయడం మంచిది.

అతిగా నీరు పోస్తే వేర్లు కుళ్లిపోతాయి

మొక్కలు ఎండిపోతున్నాయని చాలామంది పదేపదే నీరు పోస్తుంటారు. ఇలా చేయడం వల్ల నేలలో ఆక్సిజన్ తగ్గిపోయి మొక్కల వేర్లు కుళ్ళిపోతాయి. దీనిని ఓవర్ వాటరింగ్ అంటారు. నేల పైపొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయడం ఉత్తమం.

ఈ చిట్కాలు పాటించండి

వేసవిలో మొక్కలకు ఉదయాన్నే నీరు పోయడం వల్ల నీరు ఆదా అవ్వడమే కాకుండా మొక్కల పెరుగుదల గణనీయంగా ఉంటుంది. మొక్కల మొదళ్లలో ఎండుటాకులు లేదా గడ్డితో మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమను ఎక్కువ కాలం కాపాడవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ మొక్కలు ఈ వేసవిని సులభంగా తట్టుకోగలవు.

Follow Us