Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: WTC పాయింట్ల పట్టికలో సత్తా చాటిన రోహిత్ సేన.. ఆసీస్‌ను వెనక్కునెట్టిన భారత్..

WTC 2025: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి, WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన సత్తా చాటింది.

WTC Points Table: WTC పాయింట్ల పట్టికలో సత్తా చాటిన రోహిత్ సేన.. ఆసీస్‌ను వెనక్కునెట్టిన భారత్..
Wtc 2025
Follow us
Venkata Chari

|

Updated on: Jul 16, 2023 | 11:56 AM

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి, WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన సత్తా చాటింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​మూడో ఎడిషన్‌లో, ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను అధిగమించి నెం.1 స్థానానికి చేరుకోవడంలో టీమిండియా విజయం సాధించింది. వెస్టిండీస్‌పై విజయంతో, భారత్ 12 పాయింట్లు సేకరించి, 100 శాతం విజయంతో కొత్త పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత కంగారూల విజయ శాతం 61.11గా మారింది.

అంతకుముందు సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. హెడింగ్లీ టెస్టులో ఓడిపోయింది. అలాగే ICC మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ఖాతాలో రెండు పాయింట్లు తగ్గాయి.

ఇవి కూడా చదవండి

దీంతో ఇంగ్లండ్ మైనస్ రెండు పాయింట్లతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే చివరి మ్యాచ్‌లో విజయం సాధించి 10 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

2021 WTC ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్, ఆ తర్వాత గత నెలలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు తమ ప్రచారాన్ని పరిపూర్ణ విజయంతో ప్రారంభించింది. అలాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇదిలా ఉంటే, 2023లో టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియా తన తదుపరి టెస్టు సిరీస్‌ని డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 2024 జనవరి-ఫిబ్రవరిలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..