AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీసీసీఐ రాజకీయాలకు ముగ్గురు బలి.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్.. కానీ, కెరీర్‌కు గ్రహణం పట్టించిన సెలెక్టర్లు..

Indian Cricket Team: రాబోయే ఆసియా గేమ్స్ (Asian Games-2023) కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం అర్థరాత్రి జట్టును హడావుడిగా ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్సీని ఒకే ఒక్క వన్డే ఆడిన రితురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. అయితే, ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం పూర్తిగా విస్మరించారు.

బీసీసీఐ రాజకీయాలకు ముగ్గురు బలి.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్.. కానీ, కెరీర్‌కు గ్రహణం పట్టించిన సెలెక్టర్లు..
Team India
Venkata Chari
|

Updated on: Jul 15, 2023 | 8:48 PM

Share

Indian Cricket Team: రాబోయే ఆసియా గేమ్స్ (Asian Games-2023) కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం అర్థరాత్రి జట్టును హడావుడిగా ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్సీని ఒకే ఒక్క వన్డే ఆడిన రితురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. అయితే, ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం పూర్తిగా విస్మరించారు. వీరి గురించి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఒకరు ఏకంగా కెప్టెన్‌గా వస్తాడని ఆశించారు. కానీ, సెలెక్టర్లు మాత్రం వీరికి హ్యాండిచ్చారు.

15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించిన బీసీసీఐ..

ఆసియా క్రీడలు-2023 కోసం భారత పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సెప్టెంబరు 19 నుంచి చైనాలోని హాంగ్‌జౌ నగరం ఆతిథ్యం ఇస్తున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌ ‘సిక్సర్‌ కింగ్‌’ రింకూ సింగ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వికెట్‌ కీపర్‌ జితేష్‌ శర్మ, టెస్టు అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్‌, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు.

ఈ ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌ ముగింపు దశకు..

ఈ క్రమంలో ఓ ముగ్గురు ఆటగాళ్లను జట్టుకు దూరంగా ఉంచారు. మొదటి పేరు 32 ఏళ్ల పేసర్ హర్షల్ పటేల్. గుజరాత్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు హర్షల్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. హర్షల్ కంటే శివమ్ మావి ఎలా బాగున్నాడు అని కూడా ఒకరు అడిగారు. హర్షల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 9.18 ఖరీదైన ఎకానమీ రేటుతో 29 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, అతను మరే ఇతర ఫార్మాట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు.

‘ధావన్ రాజకీయాల్లో ఇరుక్కుపోయాడు’

రెండో పేరు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. వెస్టిండీస్ టూర్‌లో ధావన్‌ను ఏ ఫార్మాట్‌లోనూ జట్టులో భాగం చేయలేదు. ఆ తర్వాత అతను ఆసియా క్రీడలలో టీమ్ ఇండియా కెప్టెన్సీని నిర్వహించగలడని భావించారు. అతను ఇంతకు ముందు చాలా కాలం పాటు వన్డే ఫార్మాట్‌లో భాగమయ్యాడు. కానీ, ఇప్పుడు అతను ‘బి’ జట్టుకు కూడా సమర్థుడిగా పరిగణించబడలేదు. ధావన్‌‌ను ఎంపిక చేయకపోవడంపై యూజర్లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వినియోగదారు- ధావన్ బీసీసీఐ రాజకీయాల్లో ఎలా ఇరుక్కుపోయాడో స్పష్టంగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు.

కష్టమైన వీడ్కోలు మ్యాచ్..

ఈ జాబితాలో మూడో పేరు భారత అనుభవజ్ఞుడైన పేసర్ ఇషాంత్ శర్మది. అతని కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. 2021లో చివరిసారిగా టీమిండియా తరపున ఆడిన ఇషాంత్‌కు వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా అవకాశం రాలేదు. 34 ఏళ్ల ఈ ఆటగాడికి ఫేర్‌వెల్ మ్యాచ్ లభించడం కూడా కష్టమే. ఇషాంత్ తన కెరీర్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అతడిని ఇప్పుడు జట్టు నుంచి తప్పించారు. అతను 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 115, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..