AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPl 2025: క్యాచ్ పడదామని ట్రై చేసాడు.. కట్ చేస్తే రక్తంతో తడిసి బయటకు వెళ్లిన ముంబై బౌలర్!

ముంబయి ఇండియన్స్ vs SRH మ్యాచ్‌లో ముంబయి గెలుపొందినా, బౌలర్ కర్ణ్ శర్మ గాయం కలకలం రేపింది. క్యాచ్ ప్రయత్నంలో అతడి చేతికి బంతి బలంగా తగలడంతో రక్తస్రావం జరిగింది. ఫిజియోలు అతడికి ప్రాథమిక చికిత్స అందించి మైదానం నుంచి బయటకుకు తీసుకెళ్లారు. ముంబయి విజయం సాధించినప్పటికీ, కర్ణ్ శర్మ గాయం అభిమానుల్లో ఆందోళనను కలిగించింది.

IPl 2025: క్యాచ్ పడదామని ట్రై చేసాడు.. కట్ చేస్తే రక్తంతో తడిసి బయటకు వెళ్లిన ముంబై బౌలర్!
Karn Sharma
Narsimha
|

Updated on: Apr 18, 2025 | 2:05 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓవైపు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ విజయాన్ని అందుకోగా, మరోవైపు కీలక ఆటగాడు గాయంతో మైదానాన్ని వీడిన ఘటన కలకలం రేపింది. ముంబయి జట్టు బౌలర్ కర్ణ్ శర్మ తీవ్ర గాయంతో ఆట మధ్యలో గ్రౌండ్ ని వదిలి వెళ్ళాడు. చాహర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో, 2.5 ఓవర్ల వద్ద అభిషేక్ శర్మ కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కర్ణ్ శర్మ చేతికి బంతి బలంగా తగలడంతో గాయపడ్డాడు. బంతి తగలగానే కర్ణ్ శర్మ నొప్పితో విలవిలలాడుతూ నేలకొరిగాడు. అతడి చేతికి రక్తం కారడంతో మైదానంలో ఫిజియోలు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ దృశ్యం చూసిన ముంబయి అభిమానులు ఆందోళన చెందుతూ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

కర్ణ్ శర్మ గాయానికి ముందు ముంబయి ఇండియన్స్ జట్టుకు ఇటీవల జరిగిన మ్యాచ్‌లో అతడు కీలకంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగుల తేడాతో ముంబయి విజయం సాధించగా, ఆ మ్యాచ్‌లో కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి వచ్చి 3 వికెట్లు తీసి (3/36) మ్యాచ్ ముంచుకొస్తున్న సమయంలో జట్టును గెలుపు బాట పట్టించాడు. అప్పుడు అతడి బౌలింగ్‌తో మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పేయడం విశేషం.

ఇక రెండు జట్లు, ముంబయి ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ముంబయి ఆడిన 7 మ్యాచ్‌లలో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ కూడా రెండు విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. వరుస పరాజయాలతో వెనుకబడిన ఈ రెండు జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లను గెలిచి కొంత స్థిరత్వం పొందాయి.

అయితే తాజా మ్యాచ్‌లో ముంబయి అద్భుతంగా ఆడి సన్‌రైజర్స్‌ను ఓడించింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబయి జట్టు 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలుపు సాధించింది. ఇందులో విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చూపారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ మంచి పాత్ర పోషించారు.

ఈ విజయంతో ముంబయి ఇండియన్స్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ముందుకు సాగగా, గాయంతో బరిలోనుండి తప్పుకున్న కర్ణ్ శర్మ మాత్రం అభిమానుల్లో ఆందోళనను కలిగించాడు. ముంబయి తన విజయాల పరంపరను కొనసాగించాలంటే కీలకమైన ఈ ఆటగాడు త్వరగా కోలుకోవడం అత్యంత అవసరం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..