AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: 6 రోజుల ముందుగానే దుబాయ్‌ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టు.. ఎందుకంటే?

Team India's Asia Cup 2025 Preparations: ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు ప్రయాణిస్తుంది. కానీ, ఈసారి ఆశ్చర్యం ఏమిటంటే ఆటగాళ్లందరూ విడివిడిగా ప్రయాణిస్తున్నారు. సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ జరగనుంది. లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ జట్టు సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 19న ఓమన్‌తో మ్యాచ్‌లు ఆడనుంది.

Asia Cup 2025: 6 రోజుల ముందుగానే దుబాయ్‌ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టు.. ఎందుకంటే?
Asia Cup 2025
Venkata Chari
|

Updated on: Aug 29, 2025 | 7:06 AM

Share

Team India’s Asia Cup 2025 Preparations: సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కోసం 7 జట్లను ప్రకటించారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఓమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. అయితే, యూఏఈలో పరిస్థితులకు అనుగుణంగా భారత జట్టు 6 రోజుల ముందుగానే దుబాయ్ చేరుకుంటుంది. నివేదికల ప్రకారం, టీమిండియా సెప్టెంబర్ 4న దుబాయ్‌కు విమానంలో వెళ్లనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆటగాళ్లందరూ విడివిడిగా ప్రయాణిస్తారు. సాధారణంగా, ఏదైనా పర్యటన కోసం, టీమిండియా ఆటగాళ్లందరూ ముంబైలో సమావేశమై అక్కడి నుంచి ప్రయాణిస్తారు. కానీ, ఈసారి ఆటగాళ్లందరూ వేర్వేరు సమయాల్లో వారి వారి నగరాల నుంచి దుబాయ్‌కు విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల లాజిస్టిక్స్, ప్రయాణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

దుబాయ్‌కి విడివిడిగా ప్రయాణం..

పీటీఐ నివేదిక ప్రకారం, బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘సెప్టెంబర్ 4 సాయంత్రం నాటికి అందరు ఆటగాళ్లు దుబాయ్ చేరుకుంటారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో మొదటి నెట్ సెషన్ జరుగుతుంది. లాజిస్టిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆటగాళ్లను వారి నగరాల నుంచి దుబాయ్‌కు విమానంలో వెళ్లడానికి అనుమతిస్తారు’ అని అన్నారు.

భారత జట్టు షెడ్యూల్..

ఆసియా కప్ కోసం భారత్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అతనితో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ కూడా జట్టులో ఉన్నారు. వీరితో పాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, ప్రసీద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లను స్టాండ్-బై ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ ఆటగాళ్లు జట్టుతో దుబాయ్‌కు వెళ్లరు.

ఇవి కూడా చదవండి

భారత షెడ్యూల్ విషయానికొస్తే, జట్టు సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 14న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 19న ఓమన్‌తో లీగ్‌లోని చివరి, మూడవ మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..