Team India: వన్డే ప్రపంచ కప్ లిస్టులో 20 మంది ప్లేయర్లు.. రాహుల్పై వేటు.. పంత్, శాంసన్లలో ఒక్కరికే ఛాన్స్.. పూర్తి జాబితా ఇదే?
ODI World Cup 2023: 2023 వన్డే ప్రపంచకప్కు సంబంధించిన రోడ్మ్యాప్ను రూపొందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం (జనవరి 1) సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్ కోసం భారత్ 20 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసింది.

కొత్త సంవత్సరం నుంచి కొత్త భారత క్రికెట్ జట్టును చూస్తారు.. దూకుడే మంత్రంగా దూసుకపోతాం అంటూ టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో తాజాగా బీసీసీఐ కూడా వన్డే ప్రపంచ కప్ కోసం ఓ 20 మందితో ఫ్యూచర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఆదివారం (జనవరి 1) ముంబైలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన బీసీసీఐ.. కొన్ని ప్రధాన మార్పులను ప్రకటించింది. అందులో భాగంగానే 2023 వన్డే ప్రపంచ కప్లో జట్టు కూడా.
భారత క్రికెట్ జట్టుకు యో-యో టెస్ట్, డెక్సా తప్పనిసరి చేయడంతో ఫిట్నెస్పై పెద్ద దృష్టిని పకడ్బందీ చేసింది. అయితే రాబోయే సీజన్లో లోతుగా పర్యవేక్షించడానికి జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) IPL ఫ్రాంచైజీలతో కలిసి పని చేస్తుందని కూడా ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ నుంచి వర్ధమాన ఆటగాళ్లను ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ సీజన్లో ఆడాల్సిందేనని బీసీసీఐ పేర్కొంది.
2023 వన్డే ప్రపంచకప్ కోసం బోర్డు 20 మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించడంతో మరో పెద్ద ప్రకటన వచ్చింది. సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో జరిగే ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు టీమ్ మేనేజ్మెంట్ ఈ ఆటగాళ్లపై ఓ స్పెషల్ ఫోకస్ చేయనుందని తెలుస్తోంది.




ఈ ఆటగాళ్లు ఎవరనే దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ప్రస్తుత జట్టులోని ప్రధాన భాగం ఇందులో ఉంటుందని భావిస్తున్నారు. వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ దిగ్గజ ప్లేయర్లుగానే కొనసాగుతుంటారు.
శ్రీలంక సిరీస్ కోసం ఇటీవలి జట్టు ఎంపికలో శిఖర్ ధావన్ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ భాగస్వామ్యం విషయానికి వస్తే ఇషాన్ కిషన్ లేదా శుభమాన్ గిల్ ఉండే అవకాశం ఉంది.
ఇక మిడిల్ ఆర్డర్లో, శ్రేయాస్ అయ్యర్ 2022లో భారతదేశపు అత్యుత్తమ బ్యాటర్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ T20లో దంచి కొడుతూ, దూకుడుమీదున్నాడు. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ కూడా మెప్పించగా, మిడిల్ ఆర్డర్లో రెగ్యులర్గా ఉన్నారు. ఇటీవల ప్రమాదం జరిగినప్పటికీ, రిషబ్ పంత్ ఈవెంట్కు ఇంకా 10 నెలల సమయం ఉన్నందున ప్లాన్లో ఉండనున్నాడు. అయితే, ఇషాన్, రాహుల్, పంత్, శాంసన్లు వికెట్ కీపింగ్ ఎంపికలుగా ప్లాన్లో ఉన్న నలుగురికి అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి.
ఆల్రౌండర్ల విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో కీలకమైన సభ్యులు. ఫిట్గా ఉన్నప్పుడు వైట్-బాల్ క్రికెట్లో నిలకడగా పటిష్టమైన ప్రదర్శనలు కనబరుస్తున్నందున వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో భాగం అవనున్నాడు. అయితే అది జడేజా ఫిట్గా ఉంటే అక్షర్ పటేల్ స్థానాన్ని అయోమయంలో పడేస్తుంది.
మణికట్టు-స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ స్పిన్-బౌలింగ్ దాడికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ టీమ్ ఇండియా కోసం ODI క్రికెట్లో స్టార్టర్లుగా ఉన్నారు. మహ్మద్ సిరాజ్ 50 ఓవర్ల క్రికెట్లో తన స్థానాన్ని మరింతగా చాటాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలకు ప్రసీద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ నెలకొంది. ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్ లాంటి ప్లేయర్లు కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుంటారని తెలుస్తోంది.
15 మందితో కూడిన తుది జట్టును మెగా ఈవెంట్కు ఒక నెల ముందు బీసీసీఐ ప్రకటించనుంది. అయితే, ఇప్పటి వరకు వస్తోన్న ఊహాగానాలు బట్టి, ఆ లిస్టులో ఉండే 20 మంది ప్లేయర్లు ఎవరో లీక్ అవుతూనే ఉన్నాయి. ఆ లిస్టులో ఎవరుంటారో ఇప్పుడు చూద్దాం..
20 మంది ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్/సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ఢ్ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
