AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: మెల్‌బోర్న్ చేరిన రోహిత్ సేన.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్.. దాయాదుల పోరు జరిగేనా?

Team India Reaches Melbourne: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ కోసం భారత జట్టు మెల్‌బోర్న్‌కు చేరుకుంది. శుక్రవారం నుంచి జట్టు ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

IND vs PAK: మెల్‌బోర్న్ చేరిన రోహిత్ సేన.. శుక్రవారం నుంచి ప్రాక్టీస్.. దాయాదుల పోరు జరిగేనా?
Team India
Venkata Chari
|

Updated on: Oct 20, 2022 | 5:05 PM

Share

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో గ్రేట్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. అదే సమయంలో ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మెల్ బోర్న్ చేరుకుంది. అదే సమయంలో జట్టు శుక్రవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

టీం ఇండియా మెల్‌బోర్న్‌కు చేరుకున్న వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ శర్మతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు కనిపిస్తున్నారు. BCCI షేర్ చేసిన ఈ వీడియోలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మొదలైన ఆటగాళ్లందరూ కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఆటపై వర్ష ప్రభావం..

మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో జరిగే గ్రేట్ రైవల్రీ మ్యాచ్‌కు వర్షం విలన్‌గా మారవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందని తెలుస్తోంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డ్రైనేజీ వ్యవస్థ బాగానే ఉన్నప్పటికీ వర్షం తగ్గితే మ్యాచ్‌ని పూర్తి స్థాయిలో ఆడే అవకాశం ఉంటుంది. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌ని చూసేందుకు దాదాపు లక్ష మంది ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవచ్చని అంచనా వేస్తు్న్నారు.

వర్షంతో మ్యాచ్ తుడిచిపెట్టుకపోతే..

ప్రపంచ కప్‌ లీగ్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడి, మ్యాచ్ ఆడలేకపోతే, ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయిస్తారు.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.

పాకిస్థాన్: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ షా ఆఫ్రిది.

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..