AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: పూణేలో ల్యాండ్ అయిన టీమిండియా ఆటగాళ్లు.. బంగ్లాదేశ్‌తో పోరుకు రెడీ..

టోర్నీలో బంగ్లాదేశ్‌ను బలమైన జట్టుగా పరిగణించనప్పటికీ, పెద్ద జట్లను షాక్ ఇవ్వడంలో నిష్ణాతులుగా మారింది. ఈసారి ఈవెంట్‌లో షకీబ్ అల్ హసన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో జట్టు 3 మ్యాచ్‌లు ఆడింది. రెండు ఓడిపోయింది. ఒకటి గెలిచింది. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడంలో భారత జట్టు ఎలాంటి తప్పు చేయదు. టోర్నీ చరిత్రలో ఇరుజట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

IND vs BAN: పూణేలో ల్యాండ్ అయిన టీమిండియా ఆటగాళ్లు.. బంగ్లాదేశ్‌తో పోరుకు రెడీ..
Ind Vs Ban
Venkata Chari
|

Updated on: Oct 16, 2023 | 10:42 AM

Share

పుణెలోని MCA స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య జరిగే ప్రపంచ కప్ (ICC World Cup 2023) మ్యాచ్ కోసం టీమ్ ఇండియా (Team India) అక్టోబర్ 15 (ఆదివారం)న అహ్మదాబాద్ నుంచి పూణేకి వెళ్లింది. టీమ్ ప్లేయర్లు పూణెకు వెళ్లే విషయాన్ని బీసీసీఐ (BCCI) తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా బంగ్లాదేశ్‌పై తన విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన రోహిత్ శర్మ (Rohit Sharma)​ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారింది.

వరుసగా నాలుగో విజయంపై కన్నేసిన..

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లను టీమిండియా ఓడించింది. ఇప్పుడు పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రోహిత్ సేన వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.

ఇవి కూడా చదవండి

వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్..

బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన టచ్‌లో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కూడా పాకిస్థాన్‌పై బరిలోకి దిగాడు. గిల్ బంగ్లాదేశ్‌తో కూడా ఆడాలని భావిస్తున్నారు.

కివీస్‌పై ఓటమి..

మరోవైపు టోర్నీలో బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై షకీబ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. తద్వారా పటిష్టమైన భారత్‌ను ఓడించి టోర్నీలో తిరిగి గెలుపు బాటలోకి రావాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. ఇరుజట్ల మధ్య పూణెలోని MCA స్టేడియంలో అక్టోబర్ 19 (గురువారం)న ఇరు జట్లు తలపడనున్నాయి.

ప్రపంచకప్‌లో భారత్ vs బంగ్లాదేశ్: హెడ్ టు హెడ్..

టోర్నీలో బంగ్లాదేశ్‌ను బలమైన జట్టుగా పరిగణించనప్పటికీ, పెద్ద జట్లను షాక్ ఇవ్వడంలో నిష్ణాతులుగా మారింది. ఈసారి ఈవెంట్‌లో షకీబ్ అల్ హసన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో జట్టు 3 మ్యాచ్‌లు ఆడింది. రెండు ఓడిపోయింది. ఒకటి గెలిచింది.

బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడంలో భారత జట్టు ఎలాంటి తప్పు చేయదు. టోర్నీ చరిత్రలో ఇరుజట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

రెండు జట్లు..

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటెన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హసన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, షాక్ మెహెదీ హసన్, తస్కిన్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ సాకిబ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..