Indian Cricket Team: వచ్చే డబ్ల్యూటీసీ లో భారత్‌ ఆడే షెడ్యూల్‌ ఇదే!

సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భాగంగా టీమిండియా మొత్తం 19 టెస్టులు ఆడనుంది. ఇందులో విదేశాల్లో మూడు సిరీస్‌లు ఉండగా, స్వదేశంలో మూడు సిరీస్‌లు ఆడనుంది.

Indian Cricket Team: వచ్చే డబ్ల్యూటీసీ లో భారత్‌ ఆడే షెడ్యూల్‌ ఇదే!
Indian Cricket Team
Follow us

|

Updated on: Jun 24, 2021 | 10:44 PM

WTC 2021-23: బుధవారమే తొలి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ పూర్తయ్యాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్‌లు తలపడగా, కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మొదటి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ కల నెరవేరలేదు. అయితే, ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌తో మరో ఐసీసీ ఈవెంట్ జరగనుంది. దానికంటే ముందు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. అయితే ఇంగ్లండ్‌ తో జరగబోయే టెస్టు సిరీస్ 2021-2023 మధ్యలో జరిగే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయంట. వీటితో పాటు టీమిండియా మరో రెండేళ్ల వరకు డబ్ల్యూటీసీ పోటీలకు షెడ్యూల్‌ ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో మూడు విదేశీ పర్యటనలతోపాటు స్వదేశంలో మూడు సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. మొత్తంగా భారత్ సెకండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 19 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఇంగ్లండ్‌ జట్టుతో భారత్ ఆగస్టులో ఐదు టెస్టుల సిరీస్‌ లో తలపడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలు కానున్న ఈ ఐదు టెస్టుల సిరీస్ సెప్టెంబర్‌ 14 వరకు జరగనుంది.

కివీస్‌తో.. నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు ఆడనున్నాయి. అయితే, ఈ షెడ్యూల్‌ తేదీలింకా ప్రకటించలేదు. ఇప్పటికే ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు కివీస్‌తో పేలవ రికార్డును మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోనైనా గెలుపు బాటలో పడుతుందో, లేక యథావిధిగా ఓటమితో ముగిస్తుందా అనేది చూడాలి.

దక్షిణాఫ్రికా మూడు టెస్టుల సిరీస్‌.. ఈ ఏడాది చివర్లో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌-జనవరి నెలల్లో మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌ 15వ సీజన్‌కు పూర్తవ్వక ముందు భారత పర్యటనకు శ్రీలంక రానుంది. ఈ పర్యటన 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక టీంలు మొత్తం మూడు టెస్టులు ఆడనున్నాయి.

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు.. 2022లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య జరగనుంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు.. సెకండ్ డబ్ల్యూటీసీ టోర్నీలో చివరగా బంగ్లా తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది టీమిండియా. ఈ పర్యటన 2022 నవంబర్‌ నెలలో మొదలవనుందని తెలుస్తోంది.

Also Read:

Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక

Euro Cup 2020: చరిత్ర సృష్టించేందుకు మరో గోల్ దూరంలో రొనాల్డో; 109 గోల్స్‌తో ప్రపంచ రికార్డు సమం

Make Rohit Indian Captain: ‘కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు.. కెప్టెన్‌ తోపాటు హెడ్‌ కోచ్‌ను మార్చండి’: మీమ్స్‌ తో నెటిజన్ల ఫైర్

సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
14 ఏళ్ల కెరీర్ ను రివ్యూ చేసుకున్న సమంత.! వైరల్ గా ఆమె మాటలు.
14 ఏళ్ల కెరీర్ ను రివ్యూ చేసుకున్న సమంత.! వైరల్ గా ఆమె మాటలు.
ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!!
ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!!
టీమిండియా వద్దంది.. ఐపీఎల్ అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే..
టీమిండియా వద్దంది.. ఐపీఎల్ అక్కున చేర్చుకుంది.. కట్ చేస్తే..
కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి!
కల్లు తాగేందుకు వచ్చిన యువకుడు.. తిరిగి వెళ్తూ చేసిన ఘనకర్యానికి!
ఏపీ, తెలంగాణలో వచ్చే 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే
ఏపీ, తెలంగాణలో వచ్చే 3 నెలల్లో జరిగే ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ 'పాస్‌కీ' గురించి మీకు తెలుసా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ 'పాస్‌కీ' గురించి మీకు తెలుసా?
అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..
హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?
హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?
జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి
జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!