AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్.. సూర్య, గంభీర్‌లకు రోహిత్ శర్మ కీలక హెచ్చరిక..

Rohit Sharmas T20 World Cup Warning to Suryakumar and Gambhir: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత్ సన్నద్ధమవుతున్న వేళ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సవాళ్లను లేవనెత్తారు. జట్టు కూర్పులో స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఎంపిక, మంచు ప్రభావం గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు హెచ్చరించారు. సమతుల్యమైన జట్టు, వ్యూహాత్మక ప్రణాళికలు భారత్ విజయానికి అత్యవసరం అని ఆయన నొక్కిచెప్పారు.

ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్.. సూర్య, గంభీర్‌లకు రోహిత్ శర్మ కీలక హెచ్చరిక..
Gambhir Vs Rohit
Venkata Chari
|

Updated on: Jan 31, 2026 | 6:00 AM

Share

Rohit Sharmas T20 World Cup Warning to Suryakumar and Gambhir: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం సన్నద్ధమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ను ఈ మెగా టోర్నీకి రిహార్సల్‌గా ఉపయోగిస్తోంది. భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం జట్టు కూర్పు, మైదాన పరిస్థితులపై కొన్ని కీలక సవాళ్లను లేవనెత్తారు. ఆయన విశ్లేషణ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల ముందున్న క్లిష్టమైన నిర్ణయాలను స్పష్టం చేస్తోంది.

రోహిత్ శర్మ ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ల ఎంపికపై తన ఆందోళన వ్యక్తం చేశారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది జట్టులో సర్దుబాటు చేయడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది కాలంగా అక్షర్ పటేల్‌తో కలిసి ఈ స్పిన్ త్రయం అద్భుత ప్రదర్శన చేస్తోందని గుర్తుచేసిన రోహిత్, అయితే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా లేదా ఒక సీమర్‌ను తగ్గించి రిస్క్ తీసుకోవాలా అన్నది సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు. జట్టు సమతూకం దెబ్బతినకుండా పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంచుకోవడం ఈ ప్రపంచకప్‌లో భారత్ విజయానికి ప్రాథమిక సూత్రమని ఆయన స్పష్టం చేశారు.

మరో ముఖ్యమైన అంశం మంచు ప్రభావం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత ఉపఖండంలో మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో మంచు అంశం ఫలితాలను శాసించే అవకాశం ఉందని రోహిత్ హెచ్చరించారు. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో మంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుకు సవాలుగా మారుతుందని పేర్కొన్నారు. ముంబై వంటి నగరాల్లో చలి తక్కువగా ఉన్నప్పటికీ, రాత్రి సమయాల్లో మంచు కురవడం వల్ల బంతిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ఇది స్పిన్నర్లకు మరింత ఇబ్బందికరమని ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి చివరిలో ఈ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, టాస్ గెలవడం, పరిస్థితులను త్వరగా అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని సూచించారు.

ఈ టెక్నికల్ అంశాలతో పాటు వ్యూహాత్మక మార్పులను సమర్థవంతంగా అమలు చేస్తేనే భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకోగలదని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. స్టేడియాల్లో మంచు ప్రభావాన్ని ఎదుర్కోవడానికి బౌలర్లు తడి బంతితో ప్రాక్టీస్ చేయడం వంటి ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవడం ఈ టోర్నీలో అత్యంత కీలకం కానుంది. జట్టు ఎంపికలో సరైన నిర్ణయాలు, మైదాన పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించడం భారత్ విజయ అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..