NZ vs SCO: కమాన్ గ్రీవో, ఈ రోజు భారతదేశం మొత్తం మనతోనే ఉంది: వైరలవుతోన్న స్కాట్లాండ్‌ కీపర్ కామెంట్స్.. ఎందుకో తెలుసా?

T20 World Cup 2021: బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడేందుకు స్కాట్లాండ్ జట్టు మైదానంలోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తుందని టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

NZ vs SCO: కమాన్ గ్రీవో, ఈ రోజు భారతదేశం మొత్తం మనతోనే ఉంది: వైరలవుతోన్న స్కాట్లాండ్‌ కీపర్ కామెంట్స్.. ఎందుకో తెలుసా?
Scotland Wicketkeeper Witty
Follow us

|

Updated on: Nov 03, 2021 | 6:02 PM

T20 World Cup 2021, NZ vs SCO: టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న ఆశ దాదాపుగా ముగిసింది. ఎలాగైనా టీమిండియా సెమీఫైనల్‌లో చోటు దక్కించుకుంటుందని అభిమానులు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగానే బుధవారం న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అభిమానులు పెద్దఎత్తున ఎదురుచూడడంతో స్కాట్లాండ్‌ టీం ఆటగాళ్లు బెంబేలెత్తుతున్నారు.

సూపర్ 12కి చేరుకోవడం కోసం స్కాట్లాండ్ జట్టు మొదటి రౌండ్‌లో అద్భుత ఆటను ప్రదర్శించింది. బంగ్లాదేశ్‌పై ఘోర పరాజయాన్ని చవిచూసి జట్టును గెలిపించి తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఈరోజు కూడా టీమ్ ఇండియా అభిమానులు ఈ టీమ్ నుంచి అలాంటి పోరాటాన్నే ఆశిస్తున్నారు. స్కాట్లాండ్ జట్టు కూడా ఈరోజు యావత్ భారతదేశం తమను హర్షిస్తుందని తెలుసు. మ్యాచ్ సమయంలో, జట్టు వికెట్ కీపర్ మాట్ క్రాస్ కూడా ఇలాంటిదే మాట్లాడటం వీడియోలో కనిపించింది.

వికెట్ కీపర్ ఫన్నీ స్టేట్‌మెంట్.. స్కాట్లాండ్ జట్టు కెప్టెన్ కైల్ కోయెట్జర్ గాయం నుంచి కోలుకుని టాస్‌కు దిగాడు. టాస్‌ స్కాట్లాండ్‌కి వెళ్లగా, ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను రన్-అప్ కోసం సిద్ధమవుతున్న సమయంలో, వికెట్ కీపర్ మాట్ క్రాస్ స్టంప్స్ వెనుక నుంచి ‘కమాన్ గ్రీవో, ఈ రోజు భారతదేశం మొత్తం మనతోనే ఉంది’ అని అరుస్తున్నాడు. అది విని వ్యాఖ్యాతలు కూడా నవ్వడం మొదలుపెట్టారు. క్రాస్ మాట్లాడిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. భారత అభిమానులు దీనిని నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు.

సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్ సమీకరణాలు.. భారత్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మూడు జట్లలో భారత జట్టు విజయం సాధిస్తే భారత్‌కు 6 పాయింట్లు ఉంటాయి. దీంతో స్కాట్లాండ్ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తుందని ఆశపడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే భారత్ లాగే న్యూజిలాండ్ కూడా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఖాయం. ఇది జరిగితే, భారత్, న్యూజిలాండ్ రెండూ సమాన పాయింట్లను కలిగి ఉంటాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో ఏ జట్టు మెరుగ్గా ఉందో నిర్ణయించబడుతుంది.

Also Read: T20 World Cup: కోహ్లీ సేనకు ధీటైన ప్లేయింగ్ XI ఇదే.. టీ20 ప్రపంచకప్‌లో ఆడిస్తే ఫలితాలు ఎలా ఉండేవో.. అసలు సెలక్షన్‌లో ఏం జరుగుతోంది?

India Vs Afghanistan: భారత్ నిలవాలంటే భారీ విజయం తప్పనిసరి.. ఆఫ్ఘనిస్థాన్‌‌పై గెలవాలంటే ఈ 5 అంశాలను దాటాల్సిందే.. అవేంటంటే?

Latest Articles