AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND U 19 vs SL U 19: లంకపై ఘన విజయం.. ఆసియాకప్ ఫైనల్ చేరిన భారత్.. ఏ జట్టును ఢీ కొట్టనుందంటే?

SL U 19 vs IND U 19: అండర్ 19 ఆసియా కప్ రెండో సెమీ ఫైనల్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. చేతన్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు భారత్‌కు విజయాన్ని అందించారు.

IND U 19 vs SL U 19: లంకపై ఘన విజయం.. ఆసియాకప్ ఫైనల్ చేరిన భారత్.. ఏ జట్టును ఢీ కొట్టనుందంటే?
Ind U19 Vs Aus U19
Venkata Chari
|

Updated on: Dec 06, 2024 | 4:16 PM

Share

SL U 19 vs IND U 19: భారత అండర్ 19 క్రికెట్ జట్టు అద్భుతమైన ఆటతో ఆసియా కప్ ఫైనల్ చేరుకుంది. అండర్ 19 ఆసియా కప్ రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అండర్ 19 జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 47వ ఓవర్లోనే శ్రీలంక 173 పరుగులకే కుప్పకూలింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు సులువుగా విజయం సాధించింది. 22 ఓవర్లలోనే శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది.

చేతన్ 3 వికెట్లు తీయగా, కిరణ్-ఆయుష్ చెరో రెండు వికెట్లు..

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణయం తప్పని భారత బౌలర్లు రుజువు చేశారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. దీంతో శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక తరపున లక్విన్ అబేసింఘే అత్యధికంగా 69 పరుగులు చేశాడు. 110 బంతుల్లో తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. కాగా, షారుజన్ షణ్ముగనాథన్ 78 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. 7 శ్రీలంక బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. వీరిలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సున్నా వద్ద ఔటయ్యారు. భారత్ తరపున చేతన్ శర్మ 3 వికెట్లు తీశాడు. కిరణ్ చోర్మలే, ఆయుష్ మ్హత్రే చెరో రెండు వికెట్లు తీశారు. యుధాజిత్ గుహా, హార్దిక్ రాజ్ చెరో వికెట్ తీశారు.

వైభవ్ సూర్యవంశీ అద్భుతం బ్యాటింగ్..

174 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు దూకుడుతో ఛేదించింది. ఇందులో అతిపెద్ద సహకారం అందించింది 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. కేవలం 24 బంతుల్లోనే వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అతను దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. సూర్యవంశీ 36 బంతుల్లో 67 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 6 ఫోర్లు, ఐదు సిక్సర్లు వచ్చాయి. అతనితో పాటు, ఆయుష్ మ్హత్రే 28 బంతుల్లో 34 పరుగులు, కెప్టెన్ మహ్మద్ అమన్ 25 అజేయంగా సహకరించారు.

ఇవి కూడా చదవండి

ఫైనల్‌లో భారత్ ఏ జట్టుతో తలపడనుంది?

అండర్-19 పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి సెమీ-ఫైనల్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను ఓడించి, ఫైనల్ చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 37 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ 22.1 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..