AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!

Sikandar Raza Comments on Zimbabwe Defeat: హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల ధాటికి జింబాబ్వే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా సాధించిన ఈ ఘన విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఓటమికి పిచ్ నాణ్యత లోపించడమే ప్రధాన కారణమని, వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి క్యూరేటర్లు సిద్ధం చేసిన వికెటే కారణమని బాంబు పేల్చాడు.

పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..!
Sikandar Raza Comments On Ind Vs Zim 1st T20i
Venkata Chari
|

Updated on: Jul 24, 2026 | 6:22 PM

Share

Sikandar Raza Comments on Zimbabwe Defeat: భారత్, జింబాబ్వే మధ్య ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి సమరంలోనే టీమిండియా తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు తక్కువ పరుగులకే పరిమితం చేశారు. ఆపై 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, కేవలం 13.2 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీ కొట్టేసింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్.. ఛేజింగ్ చాలా ఈజీ..!

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. తొలి రెండు ఓవర్లలో కాస్త ఓపికగా ఆడి పిచ్‌ను అర్థం చేసుకున్న ఈ కుర్రాడు, ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని నలుమూలలా దడదడలాడించాడు. జింబాబ్వే ఏమాత్రం పోటీ ఇస్తుందని భావించినా, వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది.

ఇది కూడా చదవండి: Video: 6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ.. మోస్ట్ యంగెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

ఇవి కూడా చదవండి

క్యూరేటర్లు తప్పు చేశారు.. రాజా షాకింగ్ కామెంట్స్..!

ఓటమి అనంతరం జింబాబ్వే సారథి సికిందర్ రాజా విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు పిచ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి 12 ఓవర్ల వరకు పిచ్‌పై తీవ్రమైన తేమ ఉందని, బంతి సరిగ్గా బ్యాట్‌పైకి రాలేదని చెప్పాడు. కానీ భారత్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పిచ్ పూర్తిగా మారిపోయి బ్యాటింగ్‌కు సహకరించిందని ఆరోపించాడు. గతంలో బంగ్లాదేశ్‌తో ఆడిన తరహా పిచ్ సిద్ధం చేయాలని క్యూరేటర్లకు ముందే చెప్పానని, కానీ వారు తన మాట వినకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అసహనం వ్యక్తం చేశాడు.

ఆ ఇద్దరి పోరాటమే ఏకైక ఊరట.. రెండో మ్యాచ్‌పై ఆశలు..!

ఈ ఘోర పరాజయంలో కూడా తమ జట్టుకు మరుమాని, మధ్వేరేల భాగస్వామ్యమే ఏకైక సానుకూల అంశమని రాజా తెలిపాడు. వారిద్దరి బ్యాటింగ్ వల్లే కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగామని, లేకపోతే ఇంకా ఘోరమైన పరాభవం ఎదురయ్యేదని అంగీకరించాడు. రాబోయే రెండో టీ20 మ్యాచ్ నాటికి క్యూరేటర్లు మంచి పిచ్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నానని, పిచ్ బాగుంటే టాస్ ప్రభావం లేకుండా విజయం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఓటమికి రకరకాల సాకులు చెప్పినప్పటికీ, భారత యువ జట్టు చూపించిన పట్టుదల, అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శన ముందు జింబాబ్వే నిలవలేకపోయిందన్నది పచ్చి నిజం. రాబోయే రెండో టీ20లో జింబాబ్వే పుంజుకుంటుందో లేక భారత్ ఇదే ఊపుతో సిరీస్ కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us